టిడిపితో పొత్తెలా?: బిజెపిపై హరీష్, ఇష్టం లేదు: ఈటెల
తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చోటులేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటే ప్రత్యేక రాష్ట్ర ముసాయిదా బిల్లు ఈపాటికే రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లేదన్నారు. ప్రస్తుతం శాసనసభ, మండలిలో సభా నాయకులు, స్పీకర్, చైర్మన్ అంతా ఆంధ్రావారేనని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చ ప్రారంభించామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించినా చర్చే జరగలేదంటున్న ముఖ్యమంత్రి తీరు చెవిటోని ముందు శంఖం ఊదినట్లు ఉందన్నారు.
విలీనం ఇష్టం లేదు: ఈటెల
కాంగ్రెస్లో తెరాస విలీనానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడట్లేదని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ వేరుగా అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లాలో వి లేకరులతో మాట్లాడారు. కెసిఆర్ కృషి వలనే కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిందన్నారు.
కాంగ్రెస్లో తెరాస విలీనం చేయకపోవడం వల్లనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అవుతోందంటూ ఎర్రబెల్లి వ్యాఖ్యానించడం సమంజసం కాదని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కెసిఆర్ సారథ్యంలోని తెరాసతోనే సాధ్యమని తెలంగాణవాదులంతా ప్రగాఢంగా నమ్ముతున్నందున తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే ప్రసక్తే లేదని నాయిని నర్సింహా రెడ్డి హైదరాబాదులో అన్నారు.