అబ్బే అంతా ఒట్టిదే: టిడిపిలోనే ఉంటా, త్వరలోనే బాబును కలుస్తా: రామసుబ్బారెడ్డి
తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని జమ్మలమడుగు టిడిపి నేత, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి చెప్పారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
జమ్మలమడుగు:తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని జమ్మలమడుగు టిడిపి నేత, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి చెప్పారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రామసుబ్బారెడ్డి ప్రకటనతో ఊహగాహనాలకు తెరపడింది.
ఆదివారం నాడు తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి వివరించనున్నట్టు చెప్పారు.

ఆదినారాయణరెడ్డికి మంత్రి ఇవ్వడంతో పాటు ఆయనను పార్టీలోకి తీసుకోవడం పై పార్టీ అధిష్టానంపై రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయనను పిలిపించి బాబు మాట్లాడారు. అయినా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
విశాఖలో జరుగుతున్న మహానాడుకు కూడ ఆయన వెళ్ళలేదు.ఆదివారం ఉదయం తన అనుచరులతో సమావేశమైన తర్వాత టిడిపిలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు.త్వరలోనే చంద్రబాబును కలుస్తానని చెప్పారు. రామసుబ్బారెడ్డి ప్రకటనతో పార్టీ మారుతారనే వస్తున్న పుకార్లకు తెరపడినట్టైంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications