అబ్బే అంతా ఒట్టిదే: టిడిపిలోనే ఉంటా, త్వరలోనే బాబును కలుస్తా: రామసుబ్బారెడ్డి
తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని జమ్మలమడుగు టిడిపి నేత, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి చెప్పారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
జమ్మలమడుగు:తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని జమ్మలమడుగు టిడిపి నేత, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి చెప్పారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రామసుబ్బారెడ్డి ప్రకటనతో ఊహగాహనాలకు తెరపడింది.
ఆదివారం నాడు తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి వివరించనున్నట్టు చెప్పారు.

ఆదినారాయణరెడ్డికి మంత్రి ఇవ్వడంతో పాటు ఆయనను పార్టీలోకి తీసుకోవడం పై పార్టీ అధిష్టానంపై రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయనను పిలిపించి బాబు మాట్లాడారు. అయినా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
విశాఖలో జరుగుతున్న మహానాడుకు కూడ ఆయన వెళ్ళలేదు.ఆదివారం ఉదయం తన అనుచరులతో సమావేశమైన తర్వాత టిడిపిలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు.త్వరలోనే చంద్రబాబును కలుస్తానని చెప్పారు. రామసుబ్బారెడ్డి ప్రకటనతో పార్టీ మారుతారనే వస్తున్న పుకార్లకు తెరపడినట్టైంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications