వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్గీని కలుస్తానని కిరణ్, నేనూ తగ్గనని కెసిఆర్‌పై బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 I will meet Digvijay: Kiran
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను తాను కలుస్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం చెప్పారు. తెలంగాణ విషయంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు పరోక్షంగా వాగ్బాణాలు విసురుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిగ్గీ హైదరాబాదు వస్తున్నారు. కిరణ్ ఆయనను కలుస్తారా లేదా అనే చర్చ సాగింది. తాను కలుస్తానని కిరణ్ చెప్పడం గమనార్హం.

కలవాల్సిన అవసరం లేదు: శైలజానాథ్

తాము ఇప్పటికే దిగ్విజయ్ సింగ్‌కు అన్ని విషయాలు చెప్పినందున కొత్తగా కలవాల్సిన అవసరం ఏమీ లేదని మంత్రి శైలజానాథ్ వేరుగా అన్నారు. తాను సాయంత్రం జరగనున్న రాయలసీమ ప్రతినిధుల సమావేశానికి కూడా హాజరు కావడం లేదని స్పష్టం చేశారు.

కెసిఆర్‌పై బాబు

అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన అనంతరం టిడిఎల్పీలో చంద్రబాబు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అంతకుముందు అసెంబ్లీ లాబీల్లో చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై మరోసారి మండిపడ్డారు. కెసిఆర్ తన నోటి దురుసు తగ్గించుకోకుంటే తాను తగ్గేది లేదన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుండా కేంద్రం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు.

విభజన విషయంలో తాను కాంగ్రెసు ఎత్తుగడలకు లొంగనని, ఎవరు తీసుకున్న గోతిలో వారు పడక తప్పదన్నారు. ఎన్నికలు నెల ముందు వచ్చినా షెడ్యూల్ ప్రకారం వచ్చినా పెద్ద తేడా ఉండదన్నారు. మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉండొచ్చన్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాకపోవచ్చన్నారు.

English summary
Chief Minister Kiran Kumar Reddy on Thursday said he will meet AP congress incharge Digvijay Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X