Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవమానించారు: వైసీపీకి రాపాక వరప్రసాద్ గుడ్‌బై!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. తాజాగా, ఆయన వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇక తాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు. కత్తిమండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

పార్టీ కోసం ఎంతో కష్టపడినా.. తనను వైసీపీ అవమానించిందని వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో కష్టపడి పనిచేసినా తనకు టికెట్ ఇవ్వలేదని వాపోయారు. తనపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారన్నారు. ఇష్టం లేకపోయినా పెద్దల సూచన మేరకు ఎంపీగా పోటీ చేశానని వరప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను వైసీపీతో తెగదెంపులు చేసుకున్నట్లు చెప్పారు.

I Will resign from YCP Former MLA Rapaka Varaprasad

తాను త్వరలోనే మరో పార్టీలో చేరతానని రాపాక వరప్రసాద్ ప్రకటించారు. ఏ పార్టీలో చేరే విషయం మాత్రం చెప్పలేదు. అయితే, ఆయన తిరిగి జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ, నియోజకవర్గంలోని జనసేన నేతలు, కార్యకర్తలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది.

2019లో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరపున రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొంతకాలం తర్వాత జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనా విమర్శలు చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు వరప్రసాద్. జనసేన పార్టీ బలపడేది కాదు.. ఏదో గాలివాటంలా తాను ఒక్కడినే గెలిచా అని అప్పట్లో రాపాక వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన.. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఎమ్మెల్యేలను గెలిపించుకుంది.

ఈ నేపథ్యంలో తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో జరిగిన జనసేన సమావేశంలో రాపాక వరప్రసాద్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ వేదిక పైన రాపాక కనిపించటంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. గెలిచిన పార్టీని కాదని వెళ్లి..పవన్ పైన విమర్శలు చేసిన రాపాక తిరిగి పార్టీ సమావేశానికి ఎలా వస్తారని నిలదీశారు.

రాపాక తిరిగి జనసేనలో చేరేందుకు ముఖ్య నేతలతో ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారంపైనా వారు మండిపడుతున్నారు. రాజోలు జనసేనలో రాపాకకు తిరిగి ఎంట్రీ ఇచ్చేది లేదని నినదించారు. అయితే, ఈ అంశం పైన స్థానిక జనసేన ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ స్పందించారు. మలికిపురంలో కాలేజీ లెక్చరర్ల అంశమే రాపాక మాట్లాడారని..ఎలాంటి రాజకీయ అంశాలు రాలేదని ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+