అవమానించారు: వైసీపీకి రాపాక వరప్రసాద్ గుడ్బై!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. తాజాగా, ఆయన వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇక తాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు. కత్తిమండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీ కోసం ఎంతో కష్టపడినా.. తనను వైసీపీ అవమానించిందని వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో కష్టపడి పనిచేసినా తనకు టికెట్ ఇవ్వలేదని వాపోయారు. తనపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారన్నారు. ఇష్టం లేకపోయినా పెద్దల సూచన మేరకు ఎంపీగా పోటీ చేశానని వరప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను వైసీపీతో తెగదెంపులు చేసుకున్నట్లు చెప్పారు.

తాను త్వరలోనే మరో పార్టీలో చేరతానని రాపాక వరప్రసాద్ ప్రకటించారు. ఏ పార్టీలో చేరే విషయం మాత్రం చెప్పలేదు. అయితే, ఆయన తిరిగి జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ, నియోజకవర్గంలోని జనసేన నేతలు, కార్యకర్తలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది.
2019లో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరపున రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొంతకాలం తర్వాత జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పైనా విమర్శలు చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు వరప్రసాద్. జనసేన పార్టీ బలపడేది కాదు.. ఏదో గాలివాటంలా తాను ఒక్కడినే గెలిచా అని అప్పట్లో రాపాక వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన.. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఎమ్మెల్యేలను గెలిపించుకుంది.
ఈ నేపథ్యంలో తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో జరిగిన జనసేన సమావేశంలో రాపాక వరప్రసాద్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ వేదిక పైన రాపాక కనిపించటంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. గెలిచిన పార్టీని కాదని వెళ్లి..పవన్ పైన విమర్శలు చేసిన రాపాక తిరిగి పార్టీ సమావేశానికి ఎలా వస్తారని నిలదీశారు.
రాపాక తిరిగి జనసేనలో చేరేందుకు ముఖ్య నేతలతో ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారంపైనా వారు మండిపడుతున్నారు. రాజోలు జనసేనలో రాపాకకు తిరిగి ఎంట్రీ ఇచ్చేది లేదని నినదించారు. అయితే, ఈ అంశం పైన స్థానిక జనసేన ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ స్పందించారు. మలికిపురంలో కాలేజీ లెక్చరర్ల అంశమే రాపాక మాట్లాడారని..ఎలాంటి రాజకీయ అంశాలు రాలేదని ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ స్పష్టం చేశారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications