అందుకే ఏపీ, బాబుకు మద్దతుగానే: ‘అనంత’ అభిమానంపై వాణీ విశ్వనాథ్
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేరుతున్నట్లు ప్రకటించిన సినీ నటి వాణీ విశ్వనాథ్ మరోసారి ఆ విషయంపై స్పష్టనిచ్చారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే తాను
అనంతపురం: ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేరుతున్నట్లు ప్రకటించిన సినీ నటి వాణీ విశ్వనాథ్ మరోసారి ఆ విషయంపై స్పష్టనిచ్చారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే తాను టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అనంత ప్రజలను మర్చిపోలేను..
ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో వాణీ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం ప్రజలు చూపిన అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు.

చంద్రబాబుకే మద్దతు..
తాను త్వరలో టీడీపీ చేరుతున్నట్లు స్పష్టం చేశారు. పార్టీలో ఏ పాత్ర పోషించాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది టీడీపీ అధినేతచంద్రబాబే నిర్ణయిస్తారని చెప్పారు.
రాజకీయాల్లోకి రావాలని తనకెప్పటి నుంచో ఉందని తన మనసులోని మాటను వెల్లడించారు.

అభిమానంతోనే ఏపీకి..
తెలుగు ప్రజలపై ఉన్న అభిమానంతోనే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. ఒక వేళ తాను రాజకీయాల్లోకి రాకపోయినా చంద్రబాబుకే మద్దతు తెలుపుతానని వాణీ విశ్వనాథ్ తెలిపారు.

రోజాకు పోటీగానే..
కాగా, ఇంతకుముందు నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజాపై పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజాకు పోటీగానే వాణీ విశ్వనాథ్ను టీడీపీలో చేర్చుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications