కాపు రిజర్వేషన్ల నిర్ణయంపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: కన్నా లక్ష్మినారయణ
కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ వ్యతిరేకించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సరైన విధానం కాదని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాస్తానని పేర్కోన్నారు. గుంటూరులో మీడీయాతో కన్నా మాట్లాడారు.
Recommended Video

ఈ నేపథ్యంలోనే ఆర్ధికంగా వెనకబడిన అగ్రవర్ణపేదలకు 10 శాతం కేంద్రం కల్పించిన రిజర్వేషన్లలో, సామాజికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. వెనకబడిన సామాజిక వర్గాలకోసం రిజర్వేషన్లు కేటాయించవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్లకు సంబంధించి అధికారికంగా మంజునాథ కమిషన్ వేసిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.

కాగా టీడీపీ ప్రభుత్వం కాపులకు ప్రత్యేకంగా 5శాతం రిజర్వేషన్ కేటాయించిన నేపథ్యంలోనే నూతనంగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నిర్ణయంపై సమీక్ష చేసింది. ఇందులో బాగంగానే అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లు అన్ని కులాల వారికి చెందుతుతాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే..












Click it and Unblock the Notifications