ప్రేమించాడు,ప్రియురాలి ఇంట్లో శవమయ్యాడు
ఒంగోలు పట్టణంలోని విజయ్ నగర్ కాలనీలో వెంకటేశ్వర్లు అనే ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ధనలక్ష్మి అనే ప్రియురాలు ఇంటిలో ఆయన హత్యకు గురయ్యాడు. ధనలక్ష్మితో ఆయన వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఒంగోలు : వివాహేతర సంబంధం ఓ ఆటోడ్రైవర్ ప్రాణం తీసింది. ప్రియురాలి ఇంట్లోనే ఆయన శవమయ్యాడు. ఆటోడ్రైవర్ మరణానికి గల కారణాలను పోలీసులు వెలికితీస్తున్నారు. ప్రియురాలే తన భర్తను చంపిందంటూ భార్య ఆరోపిస్తోంది.
ఒంగోలులోని విజయ్ నగర్ కాలనీలో ఇందుర్తి వెంకటేశ్వర్లు అనే ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. విజయ్ నగర్ కాలనీలో చర్లపల్లి ధనలక్ష్మితో వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.వెంకటేశ్వర్లుకు భార్య ఉంది. అయినా ధనలక్ష్మితో ఆయన వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయమై ధనలక్ష్మికి వెంకటేశ్వర్లు కుటుంబానికి మద్య పలుమార్లు గొడవలు కూడ జరిగాయి.దీంతో కొన్నేళ్ళుగా ధనలక్ష్మి వద్దకు రావడం మానేశాడు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు మారిపోయాడని ఆయన భార్య, కుటుంసభ్యుులు సంతోషించారు. ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.
వెంకటేశ్వర్లు ధనలక్ష్మితో తిరిగి సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ధనలక్ష్మి ఇంటికి గురువారం వెళ్ళాడు వెంకటేశ్వర్లు. అయితే ఆ ఇంట్లోనే ఆయన శవమై తేలాడు. వెంకటేశ్వర్లు తలకు గాయాలై చనిపోయాడు.
ధనలక్ష్మి వెంకటేశ్వర్లును చంపిందని వెంకటేశ్వర్లు భార్య ఆరోపిస్తున్నారు. అయితే కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన చనిపోయాడని ధనలక్ష్మి చెబుతోంది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.