Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్: విశాఖపట్నం నుంచి కాశీకి ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం: తెలుగు ప్రజలకు మరో శుభవార్త అందింది. గంగా పుష్కరాల సందర్భంగా, వేసవి కాలంలో విశాఖపట్నం-వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు బుధవారం ప్రకటించింది. పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రత్యేక కృషి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జోక్యంతో గంగా పుష్కరాల సందర్భంగా ఈ వేసవి కాలంలో విశాఖపట్నం-వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది.

'కాశీ తెలుగు సమితి గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారని.. ప్రధానమంత్రి కార్యాలయం, వారణాసి జిల్లా యంత్రాంగం సమన్వయంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం, సౌకర్యాలు కల్పించడం ఇక్కడ గమనించదగ్గ విషయం' అని పేర్కొంది.

vizagtrains

విశాఖపట్నం నుంచి వారణాసి వెళ్లేందుకు ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ను రైల్వే బోర్డు ప్రకటించింది. 'గంగా పుష్కరాల కోసం విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26న బయలుదేరుతాయి. రైళ్లు వరుసగా ఏప్రిల్ 20, ఏప్రిల్ 27న తిరిగి వస్తాయి. వేసవి కాలంలో రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి వారణాసికి రైళ్లు, రిటర్న్ ప్రత్యేక రైళ్లు కూడా మేలో 5 రోజులు, జూన్‌లో నాలుగు రోజులు నడుస్తాయి. ఈ విధంగా విశాఖపట్నం నుంచి వారణాసికి 11 జతల ప్రత్యేక రైళ్లు నడపబడి తిరిగి వస్తాయని అధికారిక ప్రకటన తెలిపింది.

"వాల్తేరు డివిజన్ కొన్ని రోజుల క్రితం వేసవి కోసం ప్రత్యేక రైళ్లను ప్రతిపాదించింది.. ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోక్యం చేసుకోవడం, విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లను నడపాలనే పట్టుదలతో వెంటనే ఈ ప్రత్యేక రైళ్లు మంజూరు చేయబడ్డాయి' అని అధికారిక ప్రకటన పేర్కొంది.

 train

ఎంపీ జీవీఎల్ నరసింహారావు సకాలంలో జోక్యం చేసుకుని ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లను మంజూరు చేశారని పేర్కొన్నారు. 'గంగా పుష్కరాలు, వేసవి సెలవులకు వెళ్లే యాత్రికుల కోసం విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లను సకాలంలో మంజూరు చేయడంలో తన జోక్యం, కృషి దోహదపడ్డాయని సంతృప్తి వ్యక్తం చేస్తూ.. విశాఖపట్నంలోని, ఏపీ ప్రజలు, వ్యాపారాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు' అని పేర్కొంది.

'పెద్ద సంఖ్యలో యాత్రికులు వారణాసికి సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా విజయవాడ, తిరుపతి నుంచి వారణాసికి కూడా మరిన్ని ప్రత్యేక రైళ్లను మంజూరు చేసే ప్రయత్నాలను తాను కొనసాగిస్తున్నట్లు ఎంపీ జీవీఎల్ రావు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+