Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు- ప్రశాంత్ కిశోర్ భేటీపై స్పందించిన ఐప్యాక్: కీలక వ్యాఖ్యలు- జగన్ అగైన్..!!

Prashant Kishor: ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది.

అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం.

IPAC reaction after Prashant kishore meets Chandrababu,says its committed to ysrcp

ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా అడుగుపెట్టారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఈ సాయంత్రం ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా విజయవాడకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రశాంత్ కిశోర్.. ఒకప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 సీట్ల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో బిహార్ రాజకీయాలకు పరిమితం అయ్యారు. సొంతంగా పార్టీని నెలకొల్పారు.

అలాంటి ప్రశాంత్ కిశోర్.. ఉన్నట్టుండి విజయవాడలో అడుగుపెట్టడం చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ చంద్రబాబు, నారా లోకేష్ అభ్యర్థన మేరకు విజయవాడకు వచ్చారు. కరకట్ట నివాసంలో వారితో సమావేశం అయ్యారు.

IPAC reaction after Prashant kishore meets Chandrababu,says its committed to ysrcp

ఈ భేటీపై ఐప్యాక్ స్పందించింది. కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నామని తేల్చి చెప్పింది. సంవత్సర కాలంగా తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నామని, దీన్ని మున్ముందు కొనసాగిస్తామని ఐప్యాక్ వివరించింది.

2024లో కూడా ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడానికీ నిరంతరాయంగా శ్రమిస్తోన్నామని తెలిపింది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజారిటీతో విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+