విశాఖ ఐపిఎల్ మ్యాచ్లో వీధి కుక్కల హడావుడి(ఫొటోలు)
విశాఖపట్నం: నగరంలోని మైదానంలో మంగళవారం ఢిల్లీ డేర్డెవిల్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కాసేపు వీధి కుక్కలు హడావుడి చేశాయి. అంతేగాక, మ్యాచ్కు కొంత అంతరాయం కూడా కలిగించాయి.
ఏకంగా మ్యాచ్ జరుగుతుండగా మైదానం మధ్యలోకి చొచ్చుకొచ్చేసింది ఓ వీధి కుక్క. అప్పటికే తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్డెవిల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.

విరామం తర్వాత ఛేదనకు దిగిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు కేవలం ఐదు బంతులు మాత్రమే ఆడింది. ఈ దశలో మైదానంలోకి కుక్క రావడంతో క్రీజులో ఉన్న ఓపెనర్లు రహానె, ఖవాజా ఏకాగ్రత లోపిస్తుందని అసహనానికి గురవగా.. ఢిల్లీ ఫీల్డర్లు రిషబ్ పంత్, కౌల్టర్ నైల్, క్రిస్ మోరిస్ దాన్ని బుజ్జగించి బయటికి పంపే ప్రయత్నం చేశారు.

కాగా, ఓ టవల్తో పంపేందుకు నైల్ కాసేపు ప్రయత్నించాడు. ఇలా దాదాపు రెండు మూడు నిమిషాల పాటు వారితో ఆడుకున్న ఆ కుక్కను ఆ తర్వాత మైదానం సిబ్బంది వచ్చి బయటికి పంపేశారు.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications