Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు కేంద్రం శుభవార్త

ఏపీ నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో యాత్రలకు వీటిని నడుపుతున్నారు. పూరీ, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్‌ పుణ్యక్షేత్రాలకు ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 27న ఉదయం 10.00 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట మీదుగా వెళుతుంది. అలాగే వచ్చేనెల ఆరోతేదీన తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. వివరాలకు 92814 95848, 89773 14121 నెంబర్లలో సంప్రదించాలి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 16, 23, 30 తేదీల్లో హైదరాబాద్‌-కటక్‌(07165), 17, 24, మే 1 తేదీల్లో కటక్‌-హైదరాబాద్‌(07166) రైళ్లు నడుస్తాయి. రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం స్టేషన్లలో స్టాప్స్ ఇచ్చారు. ఈ నెల 19 నుంచి జూన్‌ 28 వరకు సికింద్రాబాద్‌-సంత్రాగచ్చి(07223), ఈనెల 20 నుంచి జూన్‌ 29 వరకు సంత్రాగచ్చి-సికింద్రాబాద్‌(07224) ప్రత్యేక రైళ్లు కూడా నడవనున్నాయి. ఇవి సామర్లకోట, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతాయి. ఈ నెల 15 నుంచి జూన్‌ 24 వరకు సికింద్రాబాద్‌-షాలిమార్‌(07225), ఈనెల 16 నుంచి జూన్‌ 25 వరకు షాలిమార్‌-సికింద్రాబాద్‌(07226) ప్రత్యేక రైళ్లు రాజమండ్రి, సామర్లకోట, తుని స్టేషన్లలో ఆగనున్నాయి.

irctc operate tourist train to prayagraj and ayodhya

రైళ్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వేలైను నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీనికి అనుగుణంగా సర్వే నిర్వహించి పనులు ప్రారంభిస్తున్నారు. దీనివల్ల అతి తక్కువ సమయంలోనే విశాఖ నుంచి విజయవాడకు చేరుకోవచ్చు. అలాగే విజయవాడ-గూడూరు మధ్య కూడా మూడోలైను నిర్మాణం జరుగుతోంది. అతి త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+