వైఎస్ హయాంలో కొల్లగొట్టారు: జగన్ను ఏకేసిన సోమిరెడ్డి
హైదరాబాద్/ విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని వైయస్ జగన్ రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారని ఆయన ధ్వజమెత్తారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు గుర్తించిన పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. వైఎస్ హయాంలో ఏపీ అవినీతిలో అగ్రస్థానంలో నిలిచిందని, ఏపీకి పర్యాటకులు కూడా రాని పరిస్థితి నెలకొందని ఆయన గుర్తు చేశారు.
వైఎస్ లూటీ చేసిన డబ్బును ప్రజలకు అప్పగిస్తే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్ హయాంలో జగన్ తన కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు.

జగన్ దీక్ష జనం కోసం కాదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రతిపక్ష నేత జగన్ చేపడుతున్న దీక్ష జనం కోసం కాదని స్వలాభం కోసమని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని , ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. రుణమాఫీ అందనివారు ఆందోళనచెందరాదని , అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి పుల్లారావు చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications