వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ బెయిల్ రద్దు: అదే చివరి ఛాన్స్ -సీబీఐ లాయర్లపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

క్విడ్ ప్రోకో సంబందిత కేసుల్లో నిందితుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్(నాంపల్లి) సీబీఐ కోర్టులో సోమవారం జరిగిన విచారణ తీరుతెన్నుల్ని పిటిషనర్ రఘురామ మీడియాకు వెల్లడించారు. వివరాలివి..

జగన్ ఆకాశం.. నేనొక ఆఫ్ట్రాల్ గాడిని -విజయమ్మ మాటతో బెయిల్ రద్దుకు-సాయిరెడ్డి బాగోతం: రఘురామ '

సీబీఐ మళ్లీ టైమ్ కోరడంతో..

సీబీఐ మళ్లీ టైమ్ కోరడంతో..

ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. నాంపల్లి సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ వేసిన దావాపై సోమవారం విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రఘురామ, జగన్ తరఫు లయర్లు లిఖిత పూర్వకంగా త‌మ‌ వాద‌న‌లు స‌మ‌ర్పించారు. తొలుత నిర్ణయాన్ని కోర్టుకే వదిలేసిన సీబీఐ.. ఆ తర్వాత తాము కూడా లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పిస్తామని చెప్పడంతో జడ్జి టైమిచ్చారు. ఇవాళ సీబీఐ రిజాయిండర్ వేయాల్సి ఉండగా, అందుకు మరింత సమయం కావాలని కోర్టుకు తెలిపింది. దీంతో జడ్జి విచార‌ణ‌ను ఈ నెల 30కి వాయిదా వేశారు. అయితే, రాబోయే వాయిదానే చివరిది కావొచ్చని పిటిషన్ రఘురామ అంటున్నారు..

కేసీఆర్ లక్ష కోట్లకు రేవంత్ రెడ్డి కౌంటర్ -లక్ష మందితో దళిత దండోరా -ఆర్ఎస్ ప్రవీణ్‌కు కాంగ్రెస్ ఆహ్వానంకేసీఆర్ లక్ష కోట్లకు రేవంత్ రెడ్డి కౌంటర్ -లక్ష మందితో దళిత దండోరా -ఆర్ఎస్ ప్రవీణ్‌కు కాంగ్రెస్ ఆహ్వానం

Recommended Video

CM Jagan Delhi Tour In Next Week Becoming Crucial In AP Politics | Oneindia Telugu
విక్రమార్కు-బేతాళుడు కథలా

విక్రమార్కు-బేతాళుడు కథలా


జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ శుక్రవారానికి(ఈనెల 30కి) వాయిదా పడిన తర్వాత పిటిషనరైన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు సీబీఐ వాళ్లు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా, వారి తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నుంచి మాత్రం సరైన మద్దతు లభించనట్లుగా పరిస్థితి ఉందని, విక్రమార్కుడు-బేతాళుడు కథలా, ప్రతిసారీ కేసు వాయిదా పడటం, మళ్లీ సీబీఐ లాయర్లు టైమ్ కోరడం పరిపాటిగా మారిందని, కనీసం లాయర్లను మార్చుకునే దిశగా సీబీఐ ఆలోచన చేయాలని రఘురామ అన్నారు..

జగన్ బెయిల్ రద్దు, చివరి అవకాశం?

జగన్ బెయిల్ రద్దు, చివరి అవకాశం?

''సరిగ్గా కీలకమైన జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ రోజే దుదృష్టవశాత్తూ, సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఇద్దరికీ జ్వరం వచ్చింది. వాళ్లకు వచ్చింది కరోనా కూడా కావొచ్చేమో. ఒకవేళ కరోనానే అయితే, ఈనెల 30న జరగాల్సిన తదుపరి విచారణకు కూడా ఇబ్బందులు కలగొచ్చు. మరి నిజంగా లాయర్లకు వచ్చిన జ్వరం కరోనాగా మారకముందే, మరోసారి విచారణ వాయిదా పడకముందే సీబీఐ వాళ్లు వేరే లాయర్లనైనా పెట్టుకొని కేసును త్వరగా ముగించాలని కోరుతున్నాను. ఎలాగూ జరిగేది లిఖిత పూర్వక వాదనలే కాబట్టి, ఆ పీపీలు రాసిచ్చినా సరిపోతుంది. నా అంచనా నిజమైతే, ఈ 30వ తేదీన గనుక సీబీఐ రిజాయిండర్ వేయకుంటే, ఇక జడ్జిగారు వాదనలు ప్రారంభించే అవకాశాలే ఎక్కువ'' అని పిటిషన్ రఘురామ పేర్కొన్నారు.

English summary
the hearing of ys Jagan Bail Cancellation Case in hyderabad cb court has been adjourned to july 30th as cbi seeks more time to file counter. the petitioner raghurama alleges that both the cbi public prosecutor gets fiver, thats why hearing was adjourned. mp also told that july 30 was last chance to cbi to file rejoinder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X