జగన్ కొత్త సమీకరణం : ప్రొటెం స్పీకర్ పేరు ఖరారు: ఆయనకే ఆ బాధ్యతలు..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాలతో కొత్త సమీకరణాలను తెర మీదకు తెస్తున్నారు. ఈ నెల 12 నుండి ప్రారంభ మయ్యే ఏపీ శాసనసభా సమావేశాల్లో సభాపతి స్థానంలో ఉండాల్సిన ప్రొటెం స్పీకర్ను జగన్ ఎంపిక చేసారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన పేరు తెర మీదకు తెచ్చారు. ఆ నాలుగు పేర్ల చుట్టే ప్రొటెం స్పీకర్ పదవి దక్కుతుందనే అంచనాలు ఉండగా..జగన్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో..ఇప్పుడు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం..కొత్త స్పీకర్ ఎంపిక అయ్యే వరకూ ప్రొటెం స్పీకర్ పని చేయనున్నారు..
ప్రొటెం స్పీకర్గా శంబంగి
విజయనగర జిల్లా బొబ్బిలి నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఏపీ ప్రొటెం స్పీకర్గా నియమితులు కానున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆయన పేరు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శంబంగి బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం నుంచి ఇప్పటికి 4సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి అనుభవించిన సుజయ కృష్ణ రంగారావును తాజా ఎన్నికల్లో శంబంగి ఓడించారు.

1983లో టీడీపీ ఆవిర్భావం నుండి ఆయన ఆ పార్టీలో పని చేసారు. టీడీపీ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్లో చేరారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నకైన శంబంగి ప్రొటెం స్పీకర్గా శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత శాసనసభ స్పీకర్ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.
తొలుత ఆ నలుగురూ పోటీలో..
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రొటెం స్పీకర్గా తొలుత నలుగురు పేర్లు వినిపించాయి. అందులో ఎమ్మెల్యేగా ఆరు సార్లు ఎన్నికైన నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి..ఆనం రామనారాయణ రెడ్డి.. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి..గోరంట్ల రూరల్ నుండి గెలిచిన టీడీపీ గెమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్లు వినిపించాయి. వాస్తవంగా వీరందరి కంటే ఏడు సార్లు గెలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుత సభ లో అందరి కంటే సీనియర్.

అయితే, ఆయనే ప్రతిపక్ష నేతగా వ్యవహరించాల్సి ఉండటంతో..ఆయన ముందుకు వచ్చే అవకాశం లేదు. విజయనగరం జిల్లాలోని మొత్తం 9 స్థానాలను వైసీపీ గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. దంతో.. ఆ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. మంత్రివర్గంలో ఆ జిల్లా నుండి నలుగురి పేర్లు వినిపిస్తున్నా.. ఇద్దరికి స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 12న ఉదయం ప్రొటెం స్పీకర్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications