ఏపీలో ఇంటిపన్నుపై మరో ఊరట-ప్రస్తుతానికి పాత పన్నే- ఎన్నికల ఆఫర్
ఏపీలో ఇంటిపన్ను చెల్లింపుదారులకు మంచి అవకాశం లభించింది. పన్నుపెంపుకు సిద్దమవుతున్న ప్రభుత్వం మధ్యలో ఇచ్చిన ఓ వెసులుబాటు ఇప్పుడు ఆస్తిపన్ను చెల్లింపుదారులకు వరం కానుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి చెల్లించాల్సిన పన్నును ఏప్రిల్ నెలలో చెల్లిస్తే ఐదుశాతం రాయితీ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ప్రభుత్వం పరోక్షంగా మరో డెడ్లైన్ ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే పన్ను మొత్తంలో భారీగా మిగులుతుందని అంచనా వేస్తున్నారు. ఆలస్యం చేస్తే మాత్రం పెరిగిన పన్ను చెల్లించక తప్పని పరిస్దితి ఎదురుకావొచ్చు.

ఏపీలో ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలు
ఏపీలో ఈ ఆర్దిక సంవత్సరం నంచి ఆస్తిపన్నును భారీగా పెంచాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. గతంలో వసూలు చేస్తున్న అద్దె విలువ ఆధారిత పన్ను కాకుండా రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో పన్ను భారం 20 నుంచి 30 శాతం తప్పదని అంతా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వానికి వరుసగా స్ధానిక సంస్దల ఎన్నికల రూపంలో ఇబ్బంది ఎదురైంది. ఎన్నికల వేళ పన్నులు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు. అందుకే ఈ పన్నుల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసేసింది.

ఆస్తిపన్ను చెల్లింపుపై బంపర్ ఆపర్
ఏపీలో ఆస్తిపన్ను పెంపును తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరం మొదలై పది రోజులు గడుస్తున్నా పాత పన్నునే వసూలు చేస్తోంది. దీంతో ఈ పది రోజుల్లో పన్ను వసూళ్లు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఈ ఆర్ధిక సంవత్సరం చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని చెల్లిస్తే ఐదుశాతం రాయితీ ఇస్తామని కూడా ప్రకటించింది. దీంతో పాత పన్నునే మందస్తుగా చెల్లించడం ద్వారా ప్రజలకు రెండు ఆఫర్లు దక్కినట్లయింది. ఐదుశాతం రాయితీతో పాటు కొత్త పన్ను భారం కూడా తప్పింది. అయితే ఇది ఎప్పటివరకూ అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

ప్రస్తుతానికి పాత పన్నులే
ఏపీలో ప్రస్తుతానికి పాత పన్నులే వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు పురపాలకశాఖ మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. గతంలో అద్దె విలువ ఆధారిత పన్ను స్ధానంలో అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్నును ప్రస్తుతానికి వసూలు చేయొద్దని సూచించింది. తద్వారా పాత పన్నునే వసూలు చేయాలని చెప్పినట్లయింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్ధానిక సంస్దల్లో పాత పన్నునే వసూలు చేస్తున్నారు. పన్ను పెరగకపోవడంతో జనం కూడా పాత పన్నునే చెల్లిస్తున్నారు.

ఎన్నికల తర్వాత పన్ను బాదుడు ?
ప్రస్తుతం ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. హైకోర్టు ఆదేశాలను బట్టి కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఆ తర్వాత గతంలో మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే నెలలో మిగిలిన మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. మే చివరి లోగా అన్ని స్దానిక సంస్దల ఎన్నికలు పూర్తి చేసేందుకు కమిషన్ సన్నద్దమవుతోంది. అంటే మే చివరి వరకూ ఎన్నికలు తప్పవు. ఆ తర్వాత జూన్లో ఆస్తిపన్ను పెంపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుంది. అప్పుడు కొత్తగా పెంచిన పన్ను అమల్లోకి రానుంది. ఆ లోపు పన్ను చెల్లించిన వారికి మాత్రం పాత పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
-
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications