జగన్ అక్రమాస్తుల కేసు: రూ.148కోట్ల విలువైన నిమ్మగడ్డ ఆస్తుల అటాచ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ భూములను ఈడీ అటాచ్ చేసింది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ భూములను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. రూ. 148.89 కోట్ల విలువైన భూములను అటాచ్మెంట్ చేస్తూ ఈడీ శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించి వ్యాంపిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అప్పట్లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ద్వారా జగన్ ప్రయోజనాలు పొందారని, జగన్ సంస్థల్లోకి పెద్ద ఎత్తున డబ్బులు రావడం జరిగిందని, అలాగే నిమ్మగడ్డ కూడా జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా లబ్ది పొందారని సీబీఐ ప్రధాన ఆరోపణ.

సీబీఐ చార్జిషీటుల ఆధారంగా ఈడీ అధికారులు కూడా చార్జిషీటు దాఖలు చేసి విచారణ జరిపారు. వ్యాంపిక్ భూముల వ్యవహారంలో నిమ్మగడ్డ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఆయన కంపెనీలకు సంబంధించిన 148.89 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications