నడి రోడ్డుమీద కాన్వాయ్ ఆపి: అక్కడికక్కడే 25 లక్షలు మంజూరు చేసి:మానవత్వం చాటుకున్న జగన్..!
ముఖ్యమంత్రి జగన్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. నడి రోడ్డు మీద తన కాన్వాయ్ ఆపి తన వద్దకు వచ్చిన బాధితులకు అండగా నిలిచి నిజమైన రియల్ హీరో అనిపించుకున్నారు. ముఖ్యమంత్రిగా విశాఖ పర్యనటకు వెళ్లిన జగన్కు అక్కడ యువత తమ స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యానర్ పట్టుకున్నారు. అది చూసి కాన్వాయ్ ఆపి జగన్ వారు కోరుకున్న విధంగా సాయం అందించారు. దీనికి విశాఖ నగరం వేదిక అయింది.
నడిరోడ్డు మీద కాన్వాయ్ ఆపి...
పాదయాత్ర సమయంలో ఎవరు బాధ చెప్పుకున్నా..విని ఓదార్చిన జగన్..ఇప్పుడు ముఖ్యమంత్రిగానూ అదే తీరును కొనసాగిస్తున్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం తన తిరుగు ప్రయాణంలో భాగంగా ఏయిర్ పోర్టుకు వెళ్తున్నారు. ఆ సమయంలో విశాఖ నగరరోడ్డు మీద కొందరు యువత బ్లడ్ కేన్సర్లో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యానర్ పట్టుకున్నారు. ఆ యువతీ యువకులను చూసిన జగన్ వెంటనే తన కాన్వాయ్ ఆపారు. కేన్సర్తో బాధ పడుతున్న తమ స్నేహితుడు నీరజ్ కుమార్ ఆపరేషన్కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని..ఈ నెలాఖరులోగా
అతడికి ఆపరేషన్ చేయించాలని సీఎం జగన్కు వివరించారు. వారి మాటలను విన్న సీఎం జగన్ వెంటనే ఆపరేషన్ కు వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ భాస్కర్ను ఆదేశించారు. అక్కడికక్కడే అవసరమైన సాయం చేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.

చేతులెత్తి యువత నమస్కారం..
తమ మిత్రుడు గురించి చెప్పగానే నడి రోడ్డు మీద ముఖ్యమంత్రి స్పందించి వెంటనే సాయం చేయటం తో వారు సీఎం జగన్కు చేతుతెత్తి నమస్కరించారు. ఇప్పుడు ఈ విషయం పైన సోషల్ మీడియాలో నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. జగన్ తన పాదయాత్రలో..ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా వెయ్యి రూపాయాలు దాటిన ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య శ్రీ కింద సేవలు అందిస్తామని..అది ఎంత మొత్తంలో ఉన్నా చికిత్స అయ్యే వరకూ వారికి ఉపశమనం కోసం కొంత నగదు అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు దీని పైన సీయంఓ కార్యాలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూలై 8న వైయస్సార్ జన్మదినం నాడు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించాలనే యోచనలో జగన్ ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications