Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో గౌతమ్ అదానీతో వైఎస్ జగన్ భేటీ: విశాఖలో భారీ ప్రాజెక్లులకు శంకుస్థాపన

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఉదయం 8.10 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు ఆయన చేరుకుంటారు. తిరిగి పది నిమిషాల్లోనే ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతోపాటు విశాఖపట్నం వెళ్లనున్నారు.

బుధవారం విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం జగన్, గౌతమ్ అదానీ పాల్గొంటారు. విశాఖలో అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లకు సీఎం జగన్, గౌతమ్ అదానీ శంకుస్థాపన చేయనున్నారు. మధురవాడలో ఇంటిగ్రేటెడ్, డేటా సెంటర్, టెక్నాలజీ పార్క్‌లను రూ. 14,634 కోట్ల పెట్టుబడితో అదానీ సంస్థ ఏర్పాటు చేయనుంది.

130 ఎకరాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ప్రాజెక్ట్-1తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 24,990 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. కాపులుప్పాడలో మరో డేటా సెంటర్, టెక్ పార్క్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడలో రూ.7210 కోట్లతో ఏర్పాటు కానున్న టెక్ పార్క్ ద్వారా 20,450 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండు ప్రాజెక్టులతో విశాఖకు రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు సహా 45వేల మందికిపైగా ఉద్యోగాలు దక్కనున్నాయి.

 YS Jagan will meet Adani in Hyderabad: big development works will inaugurated by AP CM on May 3rd in Visakhapatnam

మరోవైపు, భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్-1లో రూ. 4600 కోట్ల పెట్టుబడితో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరగనుంది. జీఎంఆర్ సంస్థ ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని చేపడుతోంది. 6 మిలియన్ ప్యాసింజర్ కెపాసిటీతో విమానాశ్రయం నిర్మాణం జరగనుంది. 2,203 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది.

అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష: కీలక ఆదేశాలు

రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, పంటలపై దాని ప్రభావం అంశంపై అధికారులతో మంగళవారం సీఎం జగన్ సమీక్షించారు. వర్షాలపై రైతుల వద్ద తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలపై మొదలైన ఎన్యుమరేషన్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. నివేదిక ఖరారు చేయాలని ఆదేశించారు.

మే నెలలోనే వైయస్సార్ రైతు భరోసాతోపాటు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఇన్‌పుట్ సబ్సిడీ జారీకి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ పూర్తి చేయాలన్నారు. మర్చి నెలలో కురిసిన వర్షాలకు సంబంధించి ఇప్పటికే పంట నష్టం అంచనాలు తయారు చేశామని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జరిగిన పంట నష్టం అంచనాలపైనా ఎన్యుమరేషన్ చురుగ్గా కొనసాగుతోందని సీఎంకి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+