జగన్ అప్పుడే నిజం చెప్తారు:యనమల, టి ప్రభుత్వంపై

Jagan will talk truth: Yanamala
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడైనా నిజాలు చెబుతారంటూ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం చురక వేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్దం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

జగన్ మాట్లాడుతుండగా యనమల లేచి ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎదురుగా సత్యమేవ జయతే బోర్డు పెట్టాల్సి ఉన్నప్పటికీ ఇంకా పెట్టలేదని, దానిని త్వరగా పెడితేనైనా జగన్ అది చూసి నిజాలు మాట్లాడుతారని యనమల ఎద్దేవా చేశారు. ఆ బోర్డు త్వరగా పెడితే బావుంటుందన్నారు.

ఆగస్టు 15 వేడుకలను తాము కర్నూలు జిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు. యనమల తెలంగాణ ప్రభుత్వం పైన కూడా మండిపడ్డారు. ఫీజు రీయింబర్సుమెంట్స్‌ను ఎపి విద్యార్థులకు ఇవ్వకుండా ఉండేందుకే తండ్రి స్థానికత అని తెలంగాణ ప్రభుత్వం అంటోందని విమర్శించారు.

విద్యార్థి మాత్రమే తెలంగాణలో పుడితే సరిపోదని... విద్యార్థి తండ్రి కూడా తెలంగాణలో పుడితేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలన్న తెలంగాణ ప్రభుత్వ వైఖరిని యనమల తప్పుబట్టారు. తండ్రి స్థానికతను అడగడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం తండ్రి స్థానికతను అడుగుతోందని ఆరోపించారు.

మరోవైపు, కృష్ణాడెల్టాకు రేపటి నుంచి నీటిని విడుదల చేయాలనే నిర్ణయం ఇప్పటిది కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ప్రజలకు తాగునీరు ఇచ్చే అంశంపై రాజకీయం తగదన్నారు. జూలై 9వ తేదీ వరకు 10 టీఎంసీల తాగునీటిని విడుదల చేయాలని రాష్ట్రపతి పాలన సమయంలోనే నిర్ణయం తీసుకున్నారన్నారు. సకాలంలో నీటి విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+