చంద్రబాబు-మోడీలపై జైరాం రమేష్ సంచలనం, 2019లో హోదాపై తొలి సంతకం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆదివారం నిప్పులు చెరిగారు. వీరిద్దరు పార్లమెంటులో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జైరాం రమేష్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మోడీ, చంద్రబాబుల వల్ల ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు.

11 రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఏపీకి ఇవ్వవచ్చుగా
11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అనుభవిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా ఇవ్వడానికి మోడీకి ఉన్న అభ్యంతరం ఏమిటో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయన్నారు. పోలవరాన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. మోడీ, చంద్రబాబులు తమ వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారన్నారు.

వాటిని అమలు చేయడం లేదు
ఎన్డీయే నేతృత్వంలోని కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా ఏపీని విస్మరించిందని జైరామ్ రమేష్ దుయ్యబట్టారు. విభజన బిల్లులో పొందుపర్చిన అంశాలను అమలు చేయకుండా అన్యాయం చేసిందన్నారు. పార్లమెంటులో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనలు అమలు చేయడం లేదన్నారు.

విభజన ద్వారా కాంగ్రెస్పై ఏపీ ప్రజల ఆగ్రహం
2014లో తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన హామీలు ఆచరణ సాధ్యం చేయకుండా ప్రజలను మోగసిస్తున్నారని జైరాం మండిపడ్డారు. కాంగ్రెస్ విభజన ద్వారా ఏపీ ప్రజల ఆగ్రహాన్ని 2014లో చవి చూసిందన్నారు.

ఏపీకి హోదాపై తొలి సంతకం
తాము బిల్లులో పొందుపర్చిన 11 అంశాల్లో ఒక్కదానికి సవరణలు చేయించలేకపోవడం బిల్లు ఎంత పగడ్బందీగా రూపొందించామనడానికి నిదర్శనం అన్నారు. ఏ ఒక్క అంశానికి ఎందుకు మార్పు చేయించలేదన్నారు. 2019లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, ఏపీకి హోదాపై తొలి సంతకం చేస్తామన్నారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications