డిప్యూటీ సీఎంగా లోకేష్ ఓకే, కానీ - జనసేన కీలక ప్రతిపాదన..!!
ఏపీలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి పైన రచ్చ సాగుతోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు వరుసగా డిమాండ్ చేస్తున్నారు. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి .. ఈ అంశం పైనే టీడీపీ వర్సస్ జనసేన కేడర్ సోషల్ మీడియా వార్ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ వివాదం పైన రెండు పార్టీల అధినాయకత్వం స్పందించలేదు. తాజాగా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయటానికి అభ్యంతరం లేదని చెబుతూనే.. జనసేన కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది.
కూటమిలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో టీడీపీ నేతలు కొత్త డిమాండ్ మొదలు పెట్టారు. హోం మంత్రి అనిత పైన వ్యాఖ్యలు.. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించిన తీరు తో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోందని టీడీపీ నేతల వాదన. దీంతో, పవన్ తో సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నేతలు వరుసగా డిమాం డ్ చేస్తున్నారు. చంద్రబాబు సమక్షంలోనే ఈ డిమాండ్ వచ్చినా.. ఆయన స్పందించలేదు. కాగా, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ అంశం పైన వార్ కొనసాగుతోంది. ఇప్పుడు టీడీపీ నేతల ప్రతిపాదన పైన జనసేన కొత్త డిమాండ్ మొదలు పెట్టింది.

లోకేశ్ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాము ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబు తో కలిపి నలుగురుగా భావించామని చెప్పుకొ చ్చారు. ఇక, మంత్రి లోకేశ్ ను డిప్యూటీ సీఎం పదవి లో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. అయితే తాము కూడా పవన్ కల్యాణ్ ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని కొత్త డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు.
తమ పార్టీ వారే కాకుండా పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరు కుంటున్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. అనవ సర వ్యాఖ్యలతో వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయవద్దంటూ టీడీపీ నేతలకు సూచించారు. పేర్ని నాని, రోజా వంటి పలువురు వైసీపీ నేతలు జేబుల్లో మైకులు పెట్టుకుని తిరుగుతున్నారని, వారికి అవకాశం ఇవ్వొద్దని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ దేశానికి కావాల్సిన నాయకుడని, అందుకే భద్రత పెంచాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేసారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications