మహిళపై జనసేన నేతలు దాడి.. నడిరోడ్డుపై..(Video)
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళపై జనసేన నాయకులు దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటన గురువారం రాత్రి తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జరిగింది. అమరావతిని రాజధానిగా చేస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సంబరాల్లో భాగంగా రైల్వేకోడూరు మెయిన్ రోడ్డుపైకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, మరి కొందరు జనసేన నేతలు వచ్చారు.

అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేసిన మహిళ, ఆమె తరపు న్యాయవాది సోదరుడు గోపితో కలిసి అదే సమయంలో టోల్ గేట్ సమీపంలోని పూల దుకాణం వద్దకు వచ్చారు. ఆమెను చూడగానే జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆమె వెంట పడ్డారు. స్థానికులు చూస్తుండగా.. పోలీసులు అడ్డుకుంటున్నా లెక్క చేయకుండా దాడికి పాల్పడ్డారు. గోపీని కొడుతూ ఊరు వదిలి వెళ్లిపోవాలంటూ రోడ్డుపైన పరిగెత్తించారు. న్యాయం చేయాలని కోరితే దాడి చేశారని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల చేతిలోని లాఠీ తీసుకుని ఆమెపై దాడి చేశారు. అయితే ఈ గొడవ జరుగుతున్నంత సేపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన కారులోనే ఉండి అంతా చూస్తుండటం గమనార్హం.
హర్ష వీణపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరులు దాడి..!!#AravaSridhar #HarshaVeena #JanasenaMLA #RailwayKoduruMLA #AndhraPradesh #NewsUpdate #OIReels #Oneindiatelugu pic.twitter.com/Yan5YztJhU
— oneindiatelugu (@oneindiatelugu) April 3, 2026
అలాగే ఈ దృశ్యాల్ని కవర్ చేస్తున్న ఓ రిపోర్టర్ పైనా జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు జర్నలిస్టును సైతం కొట్టి వీడియో పుటేజ్ ను డిలీట్ చేశారు. బహిరంగ ప్రదేశంలో.. వందలాది మంది చూస్తుండగా.. పోలీసుల సమక్షంలోనే ఇంతటి దౌర్జన్యం జరగడం పట్టణంలో భయాందోళనలు రేపుతోంది. ఇక ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన కథనాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications