పీఆర్పీ ఎందుకు నిలబడలేదంటే.. జనసేనాని చెప్పిన కారణమిదే..?
అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యం ఎందుకు నిలబడలేదో కుండబద్దలు కొట్టీ మరి చెప్పారు. జనసేనకు కార్యకర్తల బలం ఉందని .. భవిష్యత్లో మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని స్పష్టంచేశారు. సోమవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
తాను ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొగలనని, తనకు ఆ నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాలేకపోయినా .. ఓటమి గురించి బాధ లేదన్నారు. కేవలం ఒక్క ఎమ్మెల్యే గెలిచినా .. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని స్పష్టంచేశారు. జనసేన పార్టీని తన తుదిశ్వాస ఉన్నంతవరకు నడుపుతానని వెల్లడించారు. ఈ సందర్భంగా తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఎందుకు మనగలదో వివరించారు. తాను పార్టీ పెట్టాక గానీ పరిస్థితి అర్థం కాలేదన్నారు. ఇప్పుడు నేతలతో మాట్లాడితే సమస్యలు పరిష్కరం అవుతున్నాయన్నారు. అప్పుడు ఇప్పటీలా చొరవ తీసుకుంటే పార్టీ ఉండేదన్నారు. మరోవైపు చిరంజీవి మెతకవైఖరి కూడా ఓ కారణమని విశ్లేషించారు. ఆయన కఠినంగా ఉంటే పార్టీ ఉండేదన్నారు. వారి ఒత్తిడితోనే ప్రజారాజ్యం పార్టీ నడపలేకపోయారని పేర్కొన్నారు.

జనసేన పార్టీకి ఏపీ అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని గుర్తుచేశారు. భవిష్యత్లో తమ పార్టీ అధికారం చేపట్టేందు కోసం పాటుపడతామన్నారు. జనసేన పార్టీ రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే నుంచి అధికారం చేపట్టేవరకు తమ పార్టీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆయాచోట్ల జనసేన రెండు, మూడోస్థానంలో ఉందని గుర్తుచేశారు. మొదటి స్థానానికి వచ్చేందుకు నేతలంతా కృషిచేయాలని కోరారు. లోక్ సభ స్థానాల్లో కూడా పార్టీ పరిస్థితి బాగుందన్నారు. ముఖ్యంగా నరసాపురంలో జనసేన మంచి జోరు మీదున్నదన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications