పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నారు: బాబు, మోడీపై మధు ఫైర్
అనంతపురం: జిల్లాలో కరువు కారణంగా ఆత్మహత్యలు, వలసలు కొనసాగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు అన్నారు. కరువు కారణంగా ఇబ్బందిపడుతున్న రైతులను ఆదుకోవాలంటూ అనంతపురంలో వామపక్షాలు, జనసేన కలిసి భారీ కవాతు నిర్వహించాయి.
అనంతరం రఘువీరా టవర్స్ వద్ద సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు మాట్లాడారు. ఓ వైపు సీఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలతో కాలం గడుపుతుంటే.. మరో వైపు ప్రధాని మోడీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

కరువుపై సీఎం ఇప్పటికైనా స్పందించకపోతే పోరాటం తప్పదని రామకృష్ణ హెచ్చరించారు. ఏపీలో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులతోపాటు జనసేన ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications