వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన వర్సెస్ వైసీపీ, జీజీహెచ్‌లోనూ డిష్యూం డిష్యూం, ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద గొడవతో..

|
Google Oneindia TeluguNews

కాకినాడలోని జీజీహెచ్‌లో జనసేన కార్యకర్తలు హల్ చల్ చేశారు. వైసీపీ కార్యకర్తలతో జనసేన కార్యకర్తలకు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద గొడవ జరిగింది. గాయపడ్డ ఇరు పక్షాలకు చెందిన వారు చికిత్స కోసం జీజీహెచ్ వెళ్లారు. అయితే అక్కడ కూడా వారు గొడవ పడ్డారు.

ఆదివారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. వారి దాడిని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాట జరిగింది. జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిలో జనసేన కార్యకర్తలు కూడా గాయపడ్డారు.

janasena workers fight ycp workers in kakinada ggh

గాయపడ్డ ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు చికిత్స కోసం జీజీహెచ్ వెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వైసీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. అయితే ఈ ఘటనను మీడియా ప్రతినిధి మొబైల్‌లో చిత్రీకరిస్తుండగా ఆమెపై కూడా దాడిచేయడంతో సృహ తప్పి పడిపోయినట్టు తెలుస్తోంది. రిపోర్టర్‌పై దాడిని అడ్డుకున్న నర్సులపై జనసేన కార్యకర్తలు దాడిచేసినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

English summary
janasena workers fight ycp workers in kakinada ggh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X