Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేన వర్సెస్ వైసీపీ, జీజీహెచ్‌లోనూ డిష్యూం డిష్యూం, ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద గొడవతో..

కాకినాడలోని జీజీహెచ్‌లో జనసేన కార్యకర్తలు హల్ చల్ చేశారు. వైసీపీ కార్యకర్తలతో జనసేన కార్యకర్తలకు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద గొడవ జరిగింది. గాయపడ్డ ఇరు పక్షాలకు చెందిన వారు చికిత్స కోసం జీజీహెచ్ వెళ్లారు. అయితే అక్కడ కూడా వారు గొడవ పడ్డారు.

ఆదివారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. వారి దాడిని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాట జరిగింది. జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిలో జనసేన కార్యకర్తలు కూడా గాయపడ్డారు.

janasena workers fight ycp workers in kakinada ggh

గాయపడ్డ ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు చికిత్స కోసం జీజీహెచ్ వెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వైసీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. అయితే ఈ ఘటనను మీడియా ప్రతినిధి మొబైల్‌లో చిత్రీకరిస్తుండగా ఆమెపై కూడా దాడిచేయడంతో సృహ తప్పి పడిపోయినట్టు తెలుస్తోంది. రిపోర్టర్‌పై దాడిని అడ్డుకున్న నర్సులపై జనసేన కార్యకర్తలు దాడిచేసినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+