JAWAD CYCLONE: వర్షాలు మొదలు -కేంద్రం అప్రమత్తం : రంగంలోకి సహాయక బృందాలు..!!
ఏపీతో పాటుగా ఒడిశా..పశ్చిమ బెంగాల్ లోని పలు జిల్లలను వణికిస్తున్న జవాద్ తుఫాను పైన కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేస్తోంది. సహాయక బృందాలను సిద్దం చేసింది. నేవి..వైమానిక హెలికాప్టర్లను అందుబాటులో ఉంచింది. తాజా పరిస్థితులను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలకు ఆదేశించింది. తుఫాను శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కేంద్రం సమీక్ష...కలక సూచనలు
కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఏపీ, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.సముద్రంలో ఉన్న మత్స్యకారులు, వారి ఓడలను సంబంధిత సమాచారాన్ని సేకరించాలని దిశానిర్దేశం చేశారు. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తీరం వెంబడి గంటకు 45-55 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

రంగంలోకి సహాయక బృందాలు
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్యటిస్తున్నాయి. సహాయక చర్యల కోసం ఉత్తరాంధ్రకు 11ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు, మరో 4బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, మందులతోపాటు ఇతర నిత్యవసర వస్తువుల సరఫరా దృష్టి సారించాలని కేంద్రం సూచించింది.విద్యుత్, రోడ్లుతో పాటు అత్వసర సేవలను పునరుద్ధరించేందుకు సంబంధిత బృందాలను సంసిద్ధంగా ఉంచాలని పేర్కొంది.

శ్రీకాకుళంలో కురుస్తున్న వర్షాలు
తుపాను తీరం చేరే క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. తుఫాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని 12 తీరప్రాంత మండలాల్లోని 237 లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. జవాద్ తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని విభాగాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఉత్పత్తి తగ్గించాలని విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం నిర్ణయించింది.
Recommended Video

ప్రధాని మోదీ..సీఎం జగన్ సమీక్షలు
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు దక్షిణ ఒడిసాకు 'జవాద్' తుఫాన్ ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ ఎం.మహాపాత్ర తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరో తేదీ నాటికి ఏపీ, ఒడిసా, పశ్చిమబెంగాల్, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా, తుఫాన్ ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని ప్రధాని మోదీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీతో పాటు ఒడిసా, పశ్చిమ బెంగాల్కు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు 64 బృందాలను పంపనున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ వెల్లడించారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications