జగన్ మాటలు వింటే మునగడం ఖాయం: జెసి

JC Diwakar Reddy
అనంతపురం: చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్ిడ మాటలు వింటే ప్రజలు నిండా మునగడం ఖఆయమని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురం మున్సిపల్ మాజీ డిప్యూటీ చైర్మన్ సాకె వెంకటరాముడు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీ వారసులే ఖాళీగా ఉంటే వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి జగన్ ఓట్లు అడగడం సిగ్గు చేటు అని జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. లక్ష కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ ఈసారి అధికారంలోకి వస్తే మరో రెండు లక్షల కోట్లు సంపాదిస్తారని ఆయన విమర్శించారు.

వైయస్ జగన్ ఆశకు హద్దు లేదని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాకుండా తన సంక్షేమం, బంధువుల సంక్షేమం మాత్రమే చూసుకునే జగన్‌‌కు ఓటు వేయవద్దని ఆయన ప్రజలకు సూచించారు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మొదటి నుంచీ జెసి దివాకర్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+