టీఆర్ఎస్ నోటు లేకుండా గెలిచిందా: జేసీ, 'కేసీఆర్ మెడకు ట్యాపింగ్'
హైదరాబాద్: నోటు లేకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక్క సీటైనా గెలిచాడా అని అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం ఘాటుగా ప్రశ్నించారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయని వారెవరో చెప్పాలన్నారు.
అయితే, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని గ్రామాల్లో ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. నదులను అనుసంధానం చేస్తేనే జిల్లాలకు తాగు, సాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

దళితులను పావుగా వాడుకున్నారు: జూపూడి
రేవంత్ రెడ్డిని ఇరికించేందుకు కేసీఆర్ దళితులను పావుగా వాడుకున్నారని జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు. దళితుడైన సెబాస్టియన్ ఫోన్ను ట్యాప్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఉపయోగిస్తున్న భాష సరికాదన్నారు.
కేసీఆర్ తన స్థాయికి తగిన భాష మాట్లాడటం లేదన్నారు. ధర్నాలు చేసే కార్యకర్తలు ఎలాంటి భాషలు మాట్లాడుతారో కేసీఆర్ అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందన్నారు. కర్నాటకలో రామకృష్ణ హెగ్డే ఉదంతం గురించి కేసీఆర్ తెలుసుకుంటే మంచిదన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications