పవన్కు ‘జేఎఫ్సీ’ నివేదిక! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబట్టిన కమిటీ!?
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు గురువారం సాయంత్రం సంయుక్త నిజనిర్ధారణ కమిటీ 'జేఎఫ్సీ' ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఏపీని ముంచినట్లు ఆ నివేదికలో కమిటీ నిగ్గుతేలినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయాయని 'జేఎఫ్సీ' తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. శుక్రవారం మరోసారి జేఎఫ్సీ భేటీ అయి, ఈ నివేదికపై నిశితంగా చర్చించనుందని సమాచారం.

గురువారం సాయంత్రం జనసేనాని పవన్ కళ్యాణ్తో జేఎఫ్సీ త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశమై కమిటీ నివేదికపై చర్చించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని వారు పవన్కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
శుక్రవారం మరోసారి సమావేశమై జేఎఫ్సీ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ఆ నివేదికను ప్రజల ఎదుటికి తెచ్చేందుకు జనసేనాని సిద్ధమైనట్లు సమాచారం.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications