RRR: జూనియర్ ఎన్టీఆర్కు కరోనా పాజిటివ్: అంతకుముందు- వారిద్దరికీ!
హైదరాబాద్: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. దీనితో ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యులందరూ ఐసొలేషన్లో ఉంటున్నారు. తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని జూ.ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన రౌద్రం, రణం, రుధిరం (RRR) సినిమా షూటింగ్లో ఉంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్లో వైరస్ లక్షణాలేవీ కనిపించట్లేదని తెలుస్తోంది. ఆయనను అసింప్టోమేటిక్గా భావిస్తున్నారు. ఆదివారం ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఐసొలేషన్లోకి వెళ్లారు. కరోనా ప్రొటోకాల్స్ను తాము పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నామని చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని, కోవిడ్ ప్రొటోకాల్స్ను పాటించాలని కోరారు. ఇదివరకు ఇదే సినిమాలో ఎన్టీఆర్తో కలిసి నటించిన రామ్చరణ్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన కోలుకున్నారు. సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ హీరోయిన్ ఆలియా భట్ సైతం ఈ మహమ్మారి బారిన పడ్డారు. కోలుకున్న తరువాత ఆమె కొద్దిరోజుల పాటు మాల్దీవుల్లో విశ్రాంతి తీసుకున్నారు.
I’ve tested positive for Covid19. Plz don’t worry,I’m doing absolutely fine. My family & I have isolated ourselves & we’re following all protocols under the supervision of doctors. I request those who’ve come into contact with me over the last few days to pl get tested. Stay safe
— Jr NTR (@tarak9999) May 10, 2021