జగన్పై కాదు, చేసి చూపించు: లగడపాటిపై జూపూడి
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ అండ చూసుకుని, తమ పార్టీవారిని కూడా కాదని కాంగ్రెసు అధిష్టానం విభజనకు పూనుకుందని లగడపాటి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జైల్లో ఉన్నా, బయట ఉన్నా విభజనపై పోరాటం చేసిన ఏకైక వ్యక్తి జగన్ ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోసం లగడపాటి పోరాటాలు చేసి ఉంటే, ఇప్పుడు రాజీనామా చేసి బయటకు రావాలని ఆయన సవాల్ విసిరారు. విభజనను అడ్డుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ నేతలు తమను విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఇంకా పార్టీలో ఎందుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. మంత్రి వర్గ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని ఆయన అన్నారు. తాము సీమాంధ్ర బంద్కు ఇచ్చిన పిలుపునకు అనూహ్యమైన స్పందన లభించిందని ఆయన చెప్పారు.
చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ఫైర్
రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. తమ పార్టీ చేపట్టిన బంద్ విజయవంతమైందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. బంద్ విషయంలో చంద్రబాబు వెనకడుగు వేయడం సరి కాదని ఆయన అన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications