షర్మిల Vs అవినాశ్ - చంద్రబాబు కీలక నిర్ణయం, బిగ్ టర్న్..!!
ఏపీ ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. ఈ సారి కడప ఎంపీ స్థానంలో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్యనే పోరు జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి షర్మిల - వైసీపీ నుంచి అవినాశ్ పోటీ చేస్తున్నారు. కడప ఎంపీ సీటు గెలుపు జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇప్పటికే టీడీపీ నుంచి భూపేష్ రెడ్డిని అభ్యర్దిని ప్రకటించారు. షర్మిల బరిలోకి దిగటం ఖాయమైన తరువాత చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే ఇప్పుడు అక్కడ బిగ్ టర్న్ గా మారుతోంది.
కడపలో ఉత్కంఠ పోరు
జగన్ ఓటమే లక్ష్యంగా మూడు పార్టీల ఎన్డీఏ కూటమి ప్రచారంలోకి దిగింది. ఇటు కాంగ్రెస్ తో వామపక్షాలతో కలిసిన మరో కూటమి ఎన్నికల బరిలోకి దిగుతోంది. వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తోంది. కాంగ్రెస్ ఏపీ లో పోటీ చేసే తమ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించింది. కడప నుంచి వైసీపీ టికెట్పై రెండు సార్లు ఎంపీగా గెలిచిన అవినాశ్ ను తిరిగి జగన్ తమ అభ్యర్దిగా ప్రకటించారు. ఈ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనేది అవినాశ్ లక్ష్యం గా కనిపిస్తోంది. అదే సమయంలో అనూహ్యంగా పీసీసీ చీఫ్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ కుమార్తెగా తన అన్న పార్టీ అభ్యర్దిని ఓడించటమే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నారు. షర్మిల పోటీ చేస్తుంది అవినాశ్ పైనే అయినా...ఇది కడప గడ్డ పైన జగన్ వర్సస్ షర్మిల మధ్యనే పోటీగా మారుతోంది.

పార్టీల కొత్త వ్యూహాలు
వివేకా హత్య తదనంతర పరిణామాల గురించి టీడీపీ,జనసేన తో సహా షర్మిల - సునీత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తొలి సారిగా కడప గడ్డ నుంచి జగన్ వాటి పైన స్పందించారు. వివేకాను ఎవరు హత్య చేసారో ఈ జిల్లా ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. తాజాగా తాను కడప నుంచి పోటీ చేస్తున్న విషయం ప్రకటించిన షర్మిల ఈ నిర్ణయం ద్వారా తమ కుటుంబంలో చీలక వచ్చినా...చిన్నాన్న చివరి కోరిక మేరకు తాను కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. కడప తొలి నుంచి వైఎస్ కుటుంబానికి వైసీపీకి కంచుకోటగా ఉంది. రెండు సార్లు జగన్ ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. అవినాశ్ 2014, 2019లో విజయం సాధించారు. ఇప్పుడు షర్మిల ఎంట్రీ తో పోటీ ఆసక్తిగా మారుతోంది.
కడప ప్రజల మద్దతెవరికి
ఇదే సమయంలో కూటమి నుంచి ఎంపీ అభ్యర్దిగా టీడీపీ నుంచి భూపేష్ పోటీ పైన తాజాగా చంద్రబాబు ఆలోచనలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. షర్మిల బరిలోకి దిగటంతో కూటమి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించి..భూపేష్ ను జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చేయించాలనే అంశం పైన చర్చ చేస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా వైసీపీకి వ్యతిరేక ఓటింగ్ విషయంలో చోటు చేసుకొనే మార్పులతో వైసీపీకి చెక్ పెట్టవచ్చనే లెక్కల పైన కసరత్తు చేస్తున్నారు. షర్మిల వర్సస్ అవినాశ్ మధ్య పోటీలో తమకు కలిసి వస్తుందనే లెక్కలు వేస్తున్నారు. అయితే, గతంలో రెండు సార్లు కంటే ఈ సారి మెజార్టీ కడప ఎంపీ స్థానంలో పెరగాలని వైసీపీ టార్గెట్ గా ఫిక్స్ చేసుకుంది. దీంతో..ఇప్పుడు కడప ఎంపీ సీటు కోసం జరుగుతున్న పోరు రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications