కళ్లు గప్పి తిరుగుతున్న కళానికేతన్ ఎండి అరెస్టు
అనంతపురం: కళానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ వేములూరి లీలాకుమార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. లీలాకుమార్ను అరెస్టు చేసిన విషయాన్ని ధర్మవరం పట్టణ పోలీసుస్టేషన్లో డీఎస్పీ వేణు గోపాల్ తెలిపారు.
కళానికేతన్ టెక్స్టైల్ సంస్థ ధర్మవరంలోని పట్టుచీరల వ్యాపారుల నుంచి రూ.4,14,71,000 విలువ చేసే పట్టు చీరలను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన డబ్బు చెల్లించక పోవడంతో వ్యాపారులు ధర్మవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ధర్మవరంలో కళానికేతన్ సంస్థ ఎండీపై 14 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో మౌర్య హోటల్లో ఉన్న లీలాకుమార్ని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. లీలాకుమార్ని ధర్మవరం కోర్టులో హాజరుపరచారు దాంతో అతనికి కోర్టు 14రోజుల రిమాండు విధించింది.
ఎండీ లీలా కుమార్, డైరెక్టర్ లక్ష్మీశారద, అడిషనల్ డైరెక్టర్లు రాజకృష్ణ, వెంకటరవిప్రసాద్ల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంస్థ డైరెక్టర్ లక్ష్మీశారదను పోలీసులు ఆ మధ్య క్రితం హైదరాబాదులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications