‘బతికుండగానే చంపేస్తారా?, పని చేతకాకపోతే వెళ్లిపోండి’
గుంటూరు: జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంపై ఆంధప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయడం చేతకాకుంటే సెలవుపై వెళ్ళిపోవాలని సూపరింటెండెంట్ రాజునాయుడుకి కామినేని సూచించారు.
మంగళవారం ఆస్పత్రిలోని ఓ చిన్నారిని బతికుండగానే చనిపోయడంటూ పంపించేసిన వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలని, ఘటనపై క్షేత్రస్థాయి విచారణ జరపాలని డీఎంఈని మంత్రి ఆదేశించారు.

ఆయన బుధవారం ఉదయం జీజీహెచ్లో పర్యటించి, ఆస్పత్రిని పరిశీలించారు. ఘటనకు సంబంధించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై ఆయన ఆస్పత్రి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. కాగా, మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నలుగురు వైద్యులపై వేటు పడింది. ఇది ఇలా ఉండగా, గతంలో ఓ శిశువును ఈ ఆస్పత్రిలోనే ఎలుకలు కొరికి చంపిన విషయం తెలిసిందే.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications