జయేంద్ర సరస్వతికి సీరియస్.. ఐసీయూలో చేరిక
విజయవాడ : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో సూర్యారావు పేటలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రా ఆసుపత్రిలోని హార్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలో ఉన్న ఐసీయూలో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

కాగా, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు జయేంద్ర సరస్వతి. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఐదుగురు వైద్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రా ఆసుపత్రి అధినేత డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications