రాహుల్లకు కావూరి ఝలక్! గుర్తు తెచ్చుకోండి: షర్మిల

ఈ విషయం తెలిసిన రాహుల్ గాంధీ... పార్టీని వీడవద్దని కావూరిని కోరారు. దానికి ఆయన నో చెప్పారు. దిగ్విజయ్ సింగ్ కూడా పార్టీని వీడవద్దని సూచించారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ కనిపించడం లేదని, పార్టీని వీడటం మినహా మరోదారి కనిపించడం లేదని డిగ్గీకి కావూరి చెప్పారట. అయితే, ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇంకా స్పష్టత రాలేదు.
వైయస్ను గుర్తు తెచ్చుకోండి: షర్మిల
ఓటు వేసే ముందు ప్రజలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని గుర్తుకు తెచ్చుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. రైతులకు మేలు చేసేందుకు వైయస్ నిరంతరం శ్రమించేవారన్నారు. రాష్ట్రాన్ని వైయస్ కన్న తండ్రిలా పాలించారని, జగన్తో మళ్లీ ఆయన సుపరిపాలన వస్తుందన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటివి ఎన్నో పథకాలను తీసుకొచ్చారన్నారు. గొప్పలు చెప్పుకోవడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఎవరూ సాటిరారన్నారు. అధికారం కోసం ఆయన సంక్షేమ పథకాలని కొత్త పల్లవి అందుకున్నారన్నారు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటు వేసేముందు వైయస్ను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
సీమాంధ్ర కాంగ్రెసు బస్సుయాత్ర సమన్వయకర్త సుధాకర్
సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ బస్సు యాత్రకు సుధాకర్ బాబును సమన్వయకర్తగా నియమించారు.












Click it and Unblock the Notifications