గవర్నర్తో భేటీ: పాలనాపరంగా కెసిఆర్ తొలి అడుగు
హైదరాబాద్: పాలనాపరంగా తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తొలి అడుగు వేశారు. ఆయన సోమవారం గవర్నర్ నరసింహన్ను కలిసి ఐఎఎస్ అధికారి నర్సింగరావును పరిచయం చేశారు. ఆయనను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించినట్లు సమాచారం.
నర్సింగ రావు కోల్ ఇండియా చైర్మన్గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన బలంగా ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో నర్సింగరావును తెలంగాణ ప్రభుత్వ పాలనలో భాగస్వామిని చేయాలని కెసిఆర్ అనుకున్నట్లు చెబుతున్నారు. నర్సింగరావు 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ అధికారులను రప్పించాలని కెసిఆర్ గవర్నర్ను కోరినట్లు సమాచారం.

ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న గోపాల్ రెడ్డి అనే ఐఎఎస్ అధికారిని కూడా తెలంగాణకు రప్పించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఐఎఎస్ అధికారుల కొరత వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణకు చెందిన అధికారులను త్వరితగతిన రప్పించాలని కెసిఆర్ నరసింహన్ను కోరినట్లు చెబుతున్నారు.
ఎఐఎస్ అధికారుల కొరత, ఇతర విషయాల కారణంగా ప్రభుత్వాన్ని నడపడం ఓ సవాల్ వంటిదని సీమాంధ్ర నాయకులు హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ చురుగ్గా ముందుకు కదులుతున్నట్లు అర్థమవుతోంది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications