వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కేబినెట్ విస్తరణ: ఫరూక్, శ్రవణ్ ప్రమాణం, అనూహ్యంగా చోటు దక్కించుకున్న కిడారి

|
Google Oneindia TeluguNews

విజయవాడ: మంత్రులుగా ఫరూక్, కిడారి శ్రవణ్ కుమార్‌లు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. వారిద్దరితో గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిద్దరిని కేబినెట్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా, గవర్నర్ ఆమోదం తెలిపారు. రాజ్యాంగంలోని 164(4) అధికరణను అనుసరించాలని చంద్రబాబును గవర్నర్ కోరారు.

<strong>వాంగ్మూలం ఎందుకివ్వలేదు, విమానంలో అలా రావొచ్చా?: జగన్‌పై హైకోర్టు ప్రశ్నల వర్షం</strong>వాంగ్మూలం ఎందుకివ్వలేదు, విమానంలో అలా రావొచ్చా?: జగన్‌పై హైకోర్టు ప్రశ్నల వర్షం

మంత్రివర్గంలో ఇద్దరికి అవకాశం కల్పించారు. ఫరూక్ స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో మైనార్టీ మంత్రిగా పని చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని మైనార్టీ మంత్రిగా ఉన్నారు. 2017 నవంబర్ నుంచి మండలి చైర్మన్‌గా ఉన్నారు. కిడారి శ్రవణ్.. ఇటీవల నక్సల్స్ దాడిలో మృతి చెందిన కిడారి సర్వేశ్వర రావు తనయుడు.

Kidari Sravan and Farooq inducted in AP cabinet

ఎన్ఎండీ ఫరూక్‌కు మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. వైద్య, ఆరోగ్య శాఖను కూడా అప్పగించే అవకాశముంది. ఈయన పూర్తి పేరు నశ్యం మహ్మద్ ఫరూక్. సొంత స్థలం నంద్యాల. పదో తరగతి చదువుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీతో అనుబంధం ఉంది. 1981లో నంద్యాల మున్సిపల్ కౌన్సెలర్‌గా ఎన్నికయ్యారు. 1981లో వైస్ ఛైర్మన్‌గా అయ్యారు.

శ్రవణ్‌కు గిరిజన సంక్షేమ శాఖ అప్పగించారు. ఇతను ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. తండ్రి మరణంతో అనూహ్యంగా కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. వారణాసిలో ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

English summary
Kidari Sravan and NMD Farooq inducted in Andhra Pradesh cabinet on Sunday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X