రెబల్ భారం కిరణ్పై, బుజ్జగింపు: టిపై కాంగ్ కోర్ కమిటీ

వారిని అధిష్టానం బుజ్జగించే చర్యలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనుంది. దీంతో అధిష్టానం జోరుగా బుజ్జగింపు చర్యలు చేస్తోంది. ఏఐసిసి నేతలు రెబల్ అభ్యర్థులకు ఫోన్ చేసినా వారు స్పందించడం లేదు. పర్యవేక్షకులుగా వచ్చిన కుంతియా, తిరునావుక్కరసుల ఫోన్లకు వారు అందుబాటులో లేరు.
దీంతో అధిష్టానం చైతన్య, ఆదాలు నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసే బాధ్యతను కిరణ్ పైన వేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చైతన్య రాజుతో భేటీ అయ్యారు. ఆయనను బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. అయితే, చైతన్య మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదిలేదని, పోటీలో నిలబడుతానని కిరణ్కు చెప్పినట్లుగా సమాచారం.
ఢిల్లీలో కోర్ కమిటీ భేటీ
మరోవైపు ఢిల్లీలో కాంగ్రెసు కోర్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో తెలంగాణ ముసాయిదా బిల్లు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బిల్లు పైన న్యాయ సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సోమవారం బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. వచ్చే పార్లమెంటులోనే బిల్లు పెట్టాలని కోర్ కమిటీ సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications