కొబ్బరికాయ కొట్టి.. : అక్కడా కిరణ్ సమైక్యం (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని, మనం చంద్ర మండలం వైపుకు దూసుకెళ్తూ ఇంకా భౌగోళికంగా గీతలు పెట్టుకోవడం ఎంత వరకు సమంజసమని, విభజనతో సంబంధం ఉన్న వారు దీనిని ఆలోచించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రశ్నించారు.
అంతరిక్షంలోకి పంపే విడిభాగాల తయారీలోను హైదరాబాదు కీలకంగా మారిందన్నారు. కిరణ్ ఆదిభట్లలో సమూహ ఎయిర్ స్పేస్ పార్కునకు శంకుస్థాపనం చేశారు. ఇబ్రహీంపట్నంలో వైట్ గోల్డ్ ఇంటెగ్రేటెడ్ స్పింటెక్స్ పార్క్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు, బలరాం నాయక్, గీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలోను కిరణ్ పరోక్షంగా సమైక్య గళం వినిపించారు.
కిరణ్ 1
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావుతో కలిసి వైట్ గోల్డ్ ఇంటెగ్రేటెడ్ స్పింటెక్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు.
కిరణ్ 2
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావుతో కలిసి వైట్ గోల్డ్ ఇంటెగ్రేటెడ్ స్పింటెక్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొడుతున్న కావూరి.
కిరణ్ 3
కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావుతో కలిసి వైట్ గోల్డ్ ఇంటెగ్రేటెడ్ స్పింటెక్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పనబాక, ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కిరణ్ 4
ఇబ్రహీంపట్నంలో వైట్ గోల్డ్ ఇంటెగ్రేటెడ్ స్పింటెక్స్ పార్కుకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యం.
కిరణ్ 5
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్లలో సమూహ ఏరోస్పేస్ పార్కుకు సోమవారం శంకుస్థాపన చేశారు.
కిరణ్ 6
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్లలో సమూహ ఏరోస్పేస్ పార్కుకు సోమవారం శంకుస్థాపన చేశారు. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కిరణ్.
కిరణ్ 7
కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్లలో సమూహ ఏరోస్పేస్ పార్కుకు సోమవారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతున్న దృశ్యం.