ఎన్టీఆర్కు భారతరత్న: పీఎంఓకు రామ్మోహన్నాయుడు లేఖ
తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని పెట్టి అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
న్యూఢిల్లీ: తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని పెట్టి అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ గతంలో శ్రీకాకుళం పార్లమెంటుసభ్యుడు రామ్మోహన్నాయుడు రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

భారతరత్న ఎవరికి ఇవ్వాలో ప్రధాని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రామ్మోహన్నాయుడు రాసిన లేఖను పీఎంవోకు పంపించినట్టు తెలిపారు. ప్రధాని కార్యాలయం ఆ లేఖను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని రిజిజు చెప్పారు.












Click it and Unblock the Notifications