వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోటు ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వండి .. ఏపీ సర్కార్ ను కోరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

గోదావరి నది కచ్చులూరు వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. బోటు ప్రమాద ఘటనలను నివారించడానికి ఒక విధానం తీసుకురాలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. గోదావరి నదిలో మునిగి పోయిన బోటును ప్రస్తుతం బయటికి తీసే అవకాశం లేదని చెప్పిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి అవసరమైన సహకారాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

అవసరమైన సాంకేతిక సహకారం అందించి బోటును బయటికి తీయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.
జాతీయ విపత్తు నివారణ కమిటీ సమావేశానికి హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బోటు ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని జగన్ సర్కార్ ను కోరినట్లు గా చెప్పారు. ఇక ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం హాజరయ్యారు. బోటు ప్రమాదాలు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన ప్రమాదాలను నివారించడానికి గల మార్గాలను సూచించడానికి నిపుణుల కమిటీ పనిచేయాలని కోరారు.

Kishan Reddy asked Jagan government to submit a report on boat mishap

రాజమండ్రి లోని రోడ్లు మరియు భవనాల అతిథిగృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని వేసిందని ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఇక కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనపై జగన్ సర్కార్ ను నివేదిక కోరామని చెప్పిన కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా ఇలాంటి జల విపత్తులు జరగకుండా ఒక పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు .

English summary
Union Home Minister Kishan Reddy said that central government would try to provide the technical assistance needed to get the boat out.Union Minister Kishan Reddy, who attended the National Disaster Prevention Committee meeting, had asked Jagan government to submit a report on the boat mishap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X