ఈ ఏడాదీ పట్టిసీమే గతి - ఖరీఫ్ గండం దాటాలంటే మరోసారి గోదావరివైపే కృష్ణానది చూపు
కృష్ణాడెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావాలంటే గోదావరి నదీ జలాలపై తప్పనిసరిగా ఆధారపడాల్సిన పరిస్దితులు ఉన్నాయి. డెల్టాలో ఆయకట్టు సాగు కోసం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందితేనే ఈసారి ఖరీఫ్ ప్రారంభించేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గోదావరిలోనూ 14 అడుగుల నీటి మట్టం పెరిగితేనే పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి.

మరోసారి పట్టిసీమే ఆధారం....
కృష్ణానది ఎగువన వరద ప్రభావం ప్రారంభం కాకపోవడం, గతేడాది తరహాలో ఈసారి భారీగా వరద ప్రవాహం ఉండబోదన్న అంచనాల మధ్య డెల్టా రైతులు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కోసం పట్టిసీమ వైపే ఎదురుచూడాల్సిన పరిస్ధితి నెలకొంది. గతేడాది కృష్ణానదికి భారీగా వరదలు రావడంతో పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి నీరు ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఈసారి పరిస్ధితులు అంతగా అనుకూలంగా లేకపోవడంతో పట్టిసీమ ప్రాజెక్టే ఆధారం కానుందనే అంచనాలున్నాయి.

గోదావరిలో నీళ్లు వచ్చాకే...
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే అక్కడ గోదావరి నీళ్లు 14 అడుగులు ఉండాల్సిందే. కాబట్టి గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుదల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గోదావరి తూర్పు డెల్టాకు నీటి విడుదల ప్రారంభమైంది. జూన్ నాలుగో వారం కల్లా గోదావరిలో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో పట్టిసీమ లిఫ్ట్ ద్వారా నీటి విడుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గోదావరి ఇన్ ఫ్లో పెరిగినా...
గోదావరి నదిలో ప్రస్తుతం ఇన్ ఫ్లో ఏడున్నర వేల క్యూసెక్కులుగా ఉంది. పై నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి ఇది 20 వేల క్యూసెక్కులకు పెరిగినా పట్టిసీమ ద్వారా నీటి విడుదలకు అధికారులు చర్చలు జరుపుతున్నారు. గోదావరి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడం ద్వారా కృష్ణాడెల్టాను ఖరీఫ్ సీజన్ లో ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు.
-
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!











Click it and Unblock the Notifications