అదే జరిగితే..అందులోనూ సన్యాసమే: నా విశ్వసనీయతకు ఇదే కీలకం: ఏపీ ఫలితాలపై లగడపాటి..!
Recommended Video
జాతీయ సర్వేలకు భిన్నంగా ఏపీ ఎన్నికల ఫలితాల పైన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన లగడపాటి..కీలక వ్యాఖ్యలు చేసారు. తన సర్వే గురించి సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన ఫలితాలు నిజమవుతాయని..అలా కాకుంటే ఇవే తాను చేసే చివరి ఎగ్జిట్ పోల్స్ అని స్పష్టం చేసారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనాలో విఫలమైన తరువాత..ఏపీలో చెప్పినవ తప్పయితే..అది తన విశ్వసీయత దెబ్బ తీస్తుందని..ఇక ఏం చెప్పినా ఎవరు నమ్మరని వ్యాఖ్యానించారు. దీంతో..ఇప్పుడు 23న వెల్లడయ్యే ఫలితాలు లగడపాటి కొనసాగాలా..లేక సర్వేల్లోనూ సన్యాసం తీసుకోవాలా అనే విషయం తేలిపోనుంది..
అంచనాలు మాత్రమే అంటూ..
ఎగ్జిట్ పోల్స్ అంటూ అంకెలతో సహా ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో వివరించిన లగడపాటి అదే సమయంలో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జాతీయ సర్వేలకు భిన్నంగా ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన లగడపాటి తనవి అంచనాలు మాత్రమేనని..తాను ఈవిఎంల్లో తొంగి చూడలేదని వివరణ ఇచ్చారు. తన అంచనాలు అటు ఇటు అయ్యే అవకాశం లేకపోలేదన్నారు. వైసీపీ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో గతంలో తాను తెలంగాణ ఎన్నికల సమయంలో చెప్పిన అంచనాలు ఫెయిల్ అయ్యాయని..ఇప్పుడు ఏపీ విషయంలో చెప్పిన అంచనాలు 23న నిజం అవుతాయనే నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీ ఫలితాలు తన విశ్వసీయతతో ముడి పడి ఉన్నాయని వివరించారు. ఈ ఫలితాలు నిజం కాకుంటే..తాను సర్వేలు మానేస్తానని స్పష్టం చేసారు.

లగడపాటిది పలాయవాదం...
లగడపాటి ఇటువంటి సర్వే ఫలితాలను బటయ పెడతారని ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీప అధినేత జగన్ చెప్పుకొచ్చారు. లగడపాటి పేరు ప్రస్తావించి మరీ చెప్పారు. ఇక, ఇప్పుడు లగడపాటి చెబుతున్న లెక్కల్లో ఆయనలోనే ధీమా కనిపించటం లేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. తాను అంచనాలు మాత్రమే చెబుతున్నానని..ఇవిఎంల్లో తొంగి చూడలేదని చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన పలాయవాదం స్పష్టం అవుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆయన టీడీపీనేతలతో కలిసి ముందు రోజు మీడియా సమావేశానికి వచ్చారని..మరి, ఆయనకు ఏ పార్టీతో సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. అయితే, లగడపాటి మత్రం తన సర్వేను నమ్మాలని తాను ఎవరినీ కోరడంలేదన్నారు. బల్లగుద్ది అస్సలే చెప్పట్లేదు...కత్తిపెట్టి ఇది వినండని నేనేం అనలేదు. వినేవాళ్లు వింటారు. నమ్మేవాళ్లు నమ్ముతారు అంటూ లగడపాటి చెప్పుకొచ్చారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications