బాబుకు ఓ 'పీకే', లగడపాటి సీక్రెట్: జగన్-ప్రశాంత్ కిషోర్లకు చెక్?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేస్తున్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపిని గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వైసిపి, టిడిపి బలాలు, బలహీనతలను తెలుసుకుంటున్నారు.

పీకే ఆదేశాలతో ముందుకెళ్తున్న జగన్
మొత్తానికి, 2019 ఎన్నికల్లో వైసిపిని గెలిపించే బాధ్యతను ఎక్కువగా ప్రశాంత్ కిషోర్ తీసుకున్నారని చెప్పవచ్చు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి అనంతరం కూడా పీకే వైపే వైసిపి అధినేత జగన్ మొగ్గు చూపుతున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలు టార్గెట్గా పీకే సూచనల ప్రకారం జగన్ ముందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

లగడపాటి ఓ ప్రశాంత్ కిషోర్
ఇప్పుడు ఏపీలో మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓ ప్రశాంత్ కిషోర్ అయ్యారని చర్చించుకుంటున్నారు. అందుకు కారణం కూడా ఉంది.

టిడిపి బలాలు, బలహీనతలు
లగడపాటి రాజగోపాల్ టిడిపి అధినేతను పలుమార్లు కలిశారు. వారి మధ్య రాజకీయాల పరమైన చర్చ జరగడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో టిడిపి బలాలు, బలహీనతల గురించి లగడపాటి.. చంద్రబాబు వివరాలు ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

తన హాబీని టిడిపికి లబ్ధి చేకూర్చేలా..
తనకు సర్వే ఓ హాబీ అని లగడపాటి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి ఏదో ఆశిస్తున్న లగడపాటి టిడిపి గురించి మంచి ఆసక్తిని కనబరుస్తున్నారనే చర్చ సాగుతోంది. అందుకే తనకు హాబీ అయిన సర్వే ద్వారా టిడిపిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు. లగడపాటి రిపోర్టులతో చంద్రబాబు జగన్-ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు చెక్ చెబుతారా అనే చర్చ సాగుతోంది.

నేతలకు సూచనలు చేస్తారా?
ప్రస్తుతం టిడిపి బలం ఎక్కడ ఎలా ఉంది, ఏఏ ఎమ్మెల్యే పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది, అక్కడ ఎలా చేయాలి.. తదితర అంశాలపై చంద్రబాబుకు పూర్తిస్థాయి నివేదికలు ఇస్తున్నట్లుగా భావిస్తున్నారు. తద్వారా చంద్రబాబుకు లగడపాటి మరో పీకే అయ్యారని అంటున్నారు. లగడపాటి సర్వే రిపోర్టుల ఆధారంగా చంద్రబాబు నేతలకు సూచనలు చేయనున్నారని అంటున్నారు.
-
చెప్పినా జగన్ వినలేదు.. అందుకే ఓటమి, కొడాలి నాని సంచలనం..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!











Click it and Unblock the Notifications