వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు జడ్ ప్లస్ భద్రతకు నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lalu Prasad Yadav
రాంచీ: దాణా కుంభకోణం కేసులో అరెస్టై జైలులో ఉన్న వెళ్లిన రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడి) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్ ప్లస్ కేటగిరిని నిరాకరించింది.

బిర్సా ముండా జైలు సూపరింటెండెంట్ ధర్మేంద్ర పాండే మాట్లాడుతూ... తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగించాలని లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించిందని తెలిపారు.

జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బ్లాక్ క్యాట్ కమాండోస్ రక్షణ ఉంటుంది. లాలూ ఎక్కడికైనా వెళ్లితే ముప్పై మంది కమాండోలు ఆయన వెంట ఉంటారు. లాలూకు బ్లాక్ కమాండోస్ నిత్యం రక్షణగా ఉంటారు.

దాణా కుంభకోణంలో అరెస్టైన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం బిర్సా ముండా జైలులో ఉన్నారు. ఆయనను అక్టోబర్ 3వ తేదిన సిబిఐ ప్రత్యేక కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి, జైలు శిక్ష ఖరారు చేయనుంది.

English summary

 After being convicted in the Fodder scam case, the CBI court turned down Lalu Prasad Yadav's plea to keep his Z-plus security in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X