గోపాల గోపాల చిత్రంపై హైకోర్టులో కేసు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్లు నటించిన గోపాల గోపాల చిత్ర ప్రదర్శన పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. చిత్ర ప్రదర్శన ధ్రవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ హైదరాబాదుకు చెందిన రఘునాథ రావు హైకోర్టులో కేసు వేశారు.
పవన్, వెంకటేష్లు నటించిన గోపాల గోపాల చిత్రం పైన న్యాయవాదులు ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆరు రోజుల క్రితం పలువురు న్యాయవాదులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో తమను కించపరిచే సన్నివేశాలున్నాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

కాగా, ఇద్దరు టాప్ హీరోలు కలిసిన నటించిన గోపాల గోపాల చిత్రం విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద గోపాల గోపాల పది రోజుల కలెక్షన్స్ నలభై కోట్లకు చేరుకుంది. నైజామ్, సీడెడ్, ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరిల్లో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు అంతటా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications