రాజీనామాలు ఆమోదించను: స్పీకర్, మళ్లీ వస్తాం.. వైసీపీ ఎంపీలు, 'హాజరైనా జాప్యం ఎందుకు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్తో మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. రాజీనామా చేయడానికి గల కారణాలను ఆమె వారిని అడిగి తెలుసుకున్నారు. రాజీనామాలు భావోద్వేగంతో చేసినట్లుగా ఉందని, పునరాలోచించుకోవాలని ఆమె సూచించారు. అనంతరం వారం రోజుల తర్వాత కలవాలని చెప్పారు.
చదవండి: భావోద్వేగంతో రాజీనామాలు, మళ్లీ ఆలోచించండి: వైసీపీ ఎంపీలకు స్పీకర్ సుమిత్ర
స్పీకర్తో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. మా రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ను కోరామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాజీనామాలపై మరోసారి ఆలోచించాలని స్పీకర్ కోరారని, మేం మాత్రం తక్షణమే ఆమోదించాలని కోరామన్నారు. కర్ణాటకలో ఇద్దరు ఎంపీల రాజీనామాలు ఆమోదించారని, తమవి కూడా ఆమోదించాలని కోరినట్లు తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు ఇచ్చామన్నారు.

ఏపీ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదే?
ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తే బలం చేకూరుతుందనేది తమ నమ్మకమని వైవీ అన్నారు. రాజీనామాలు ఆమోదించకుంటే మళ్లీ వచ్చి స్పీకర్ను అడుగుతామని చెప్పారు. టీడీపీ ఎంపీలు కూడా మాతో పాటు రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. మా ఎమ్మెల్యేలను టీడీపీ సంతలో పశువులను కొన్నట్లుగా కొన్నారని, వారిపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, హోదాపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

రాజీనామాలు ఆఖరి అస్త్రం
ప్రత్యేక హోదా కోసం ఆఖరి అస్త్రంగా తాము రాజీనామాలు చేశామని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని కోరామని, లేదంటే మళ్లీ వచ్చి అడుగుతామని స్పీకర్తో చెప్పామన్నారు. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఫిరాయింపుల అంశాన్ని కూడా స్పీకర్ను అడిగామని, ప్రివిలేజ్ కమిటీకి పంపామని చెప్పారని, వెంటనే చర్యలు తీసుకోకుంటే ఆ చట్టానికి అర్థం లేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉండి ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

ఉప ఎన్నికలకు మేం సిద్ధం
ప్రజలలోకి వెళ్లేందుకు సీఎం చంద్రబాబు భయపడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. రాజీనామాలు చేస్తే ఓటమి చెందుతామని భయపడుతున్నారన్నారు. అందుకే ఎంపీల పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశాన్ని పెండింగులో పెట్టారన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ను కోరామని, ఉప ఎన్నికలకు తాము సిద్ధమన్నారు. కాగా, వారు భావోద్వేగంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, పునరాలోచన చేయాలని, ఇప్పుడు ఆమోదించనని, వచ్చే వారం రావాలని వైసీపీ ఎంపీలకు సూచించిన విషయం తెలిసిందే.

స్పీకర్ ఎదుట హాజరైనా ఆమోదించరా?
వైసీపీ ఎంపీల రాజీనామాల్లో చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని మంత్రి యనమల రామకృష్ణుడు అంతకుముందు ఎద్దేవా చేశారు. రాజీనామాల పేరుతో వైసీపీ, బీజేపీ డ్రామాలాడుతున్నాయన్నారు. రాజీనామాలు ఆమోదించకుండా తాత్సారం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. స్పీకర్ ఎదుట హాజరై రాజీనామాలు ఆమోదించమని కోరితే ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దె దించడమే టీడీపీ ధ్యేయమన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications