నన్ను ఇలానా.. సంపూర్ణేష్ తో పోలుస్తారా..? : లోకేష్ ఆవేదన
అధికార ప్రతిపక్షాల మధ్య ఉండే వివాదాలు కొన్నిసార్లు హాస్యాస్పద కామెంట్స్ కు దారి తీస్తాయి. విమర్శించే ప్రతిపక్షానికి, వినే జనానికి ఆ మాటలు నవ్వు తెప్పించినా..! టార్గెట్ చేసిన వ్యక్తులకు మాత్రం కోపం నశాలనికంటడం ఖాయం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇదే రకంగా తయారైనట్టుగా సమాచారం.
జగన్ జలదీక్ష సందర్ఛంగా వైసీపీ నేతలు లోకేష్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మాట్లాడిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూషణం.. 'చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ను మహేష్ బాబులా తీర్చిదిద్దాలనుకున్నారని కానీ, కనీసం సంపూర్ణేష్ బాబులా కూడా తయారు చేయలేకపోయారని' విమర్శించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'లోకేష్ ను చంద్రబాబు మోహన్ బాబులా తయారు చేద్దామనుకున్నారు గానీ ఆఖరికి బాబు మోహన్ లా కూడా తయారు చేయలేకపోయారని' ఎద్దేవా చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలు కాస్త లోకేష్ చెవిన పడడంతో సదరు వైసీపీ నేత కామెంట్స్ పట్ల అసహనం వ్యక్తం చేశారట లోకేష్.
'మహేష్ బాబును చేద్దామనుకుంటే సంపూర్ణేష్ బాబు కూడా కాలేదు'
అంతేకాదు, తాను ఓ బిడ్డకు తండ్రి అయినా కూడా.. తనపై పప్పు, ఏమి తెలియని వాడంటూ ప్రతిపక్షాలు కామెంట్ చేయడంపై అసంతృప్తికి లోనవుతున్నారట లోకేష్. ముఖ్యంగా తనను సంపూర్ణేష్ బాబు కంటే తక్కువ చేసే విధంగా కామెంట్ చేయడంపై తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారట. కాగా.. దీనిపై ట్విట్టర్ ద్వారా లోకేష్ కౌంటర్ ఏమైనా ఇస్తారా..! అన్నది చర్చనీయాంశంగా మారింది.