మూర్ఖత్వం అసలుపేరు, అహంభావం ముద్దుపేరు జగన్ అట .. జగన్ లో కసి లోకేష్ కు బాగా నచ్చిందట
ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన తరువాత టీడీపీ నేతలు అందరు కూడా దాదాపుగా సైలెంటుగా ఉంటున్నారు. అయితే టిడిపి నుండి వైసిపి ప్రభుత్వంపై, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాటల దాడి చేస్తూ దూకుడు చూపిస్తున్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇంత జోష్ చూపించని లోకేష్ బాబు ఓటమి తర్వాత బాగా యాక్టివ్ అయ్యారు. ఆయన ఏపీ ప్రభుత్వం పై చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు.

విద్యుత్ ఒప్పందాల సమీక్ష గురించి జగన్ కు చురకలు వేసిన నారా లోకేష్
ఏ మాత్రం అవకాశం దొరికినా వైసిపి ప్రభుత్వం మీద, వైసీపీ నాయకుల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు నారా లోకేష్. ఎక్కువగా ఏపీలోని రాజకీయ నాయకులు తమ సమయం వృధా కాకుండా, పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియా వేదికగా రాజకీయ పంచాయతీలకు తెరలేపారు. ఇక అదే బాటలో నారా లోకేష్ సైతం ట్విట్టర్ ని వేదికగా చేసుకొని మరీ జగన్ ప్రభుత్వాన్ని నాయకులందరినీ విమర్శిస్తూ వరుసగా ట్వీట్లు పెడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల విద్యుత్ ఒప్పందాల సమీక్ష కేంద్ర ప్రభుత్వం వద్దన్నా రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా విద్యుత్ ఒప్పందాల సమీక్ష జరిపితీరుతామని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో జగన్ పై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు నారా లోకేష్ . ఇక అక్కడితోఆగకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కసి తనకు చాలా నచ్చిందంటూ సెటైర్లు వేశారు.

మూర్ఖత్వం అసలు పేరు, అహంభావం ముద్దు పేరు జగన్ అని పేర్కొన్న చినబాబు లోకేష్
ఒక పోస్ట్ లో ఇక జగన్ కు మూర్ఖత్వం వుందని ఆయన ఆరోపించారు. మూర్ఖత్వం అసలు పేరు, అహంభావం ముద్దు పేరు అయిన జగన్ గారిని చూస్తుంటే ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది. విద్యుత్ ఒప్పందాలు పారదర్శకంగానే జరిగాయని, సమీక్ష వద్దని కేంద్రం, మేధావులు చెప్పినా జగన్ గారి చెవికెక్కలేదు. ఓ కమిటీ వేసి, ఏదో చేసేద్దామని, లేని అవినీతిని నిరూపించాలని కసిగా ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఇక మరొక ట్వీట్ లో నారా లోకేష్ కరెంటు కోతల మీద దృష్టిపెట్టండి. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టకండి అని సలహా ఇచ్చారు.

మీ కసి నాకు తెగ నచ్చేసింది కానీ ఎన్టీపీసీ వాళ్ళకు నచ్చలేదనుకుంటా అంటూ ఎద్దేవా చేసిన లోకేష్
" జగన్ గారూ! మీ కసి నాకు నచ్చింది. కానీ ఎన్టీపీసీ వాళ్ళకు నచ్చలేదనుకుంటా. అందుకే ఈ లెటర్ రాసారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యుత్ ఒప్పందాలన్నీ పారదర్శకంగా జరిగాయని, నాటి మార్కెట్ ధరల కంటే తక్కువకే కొనుగోలు ధరలు నిర్ణయించామని రాసారు."
"బిడ్ల ఎంపిక విధానాన్ని జాతీయ విద్యుత్తు నియంత్రణ మండలి కూడా ప్రశంసించిందని రాసారు. ఏంటో! మీ కసిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా కమిటీలు, సమీక్షలు అంటూ కాలయాపన చేయకుండా ఏపీలో కరెంటు కోతల మీద దృష్టిపెట్టండి. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టకండి." అంటూ సెటైర్లు వేశారు. అయితే లోకేష్ బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడుతూ, ఇలా ఎప్పటికి ట్వీట్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చే లోకేష్ బాబు ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే బాగుంటుందని లోకేష్ పైన ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తానికి లోకేష్ చెప్పిన విషయం ఏదైనా జగన్ లో ఉన్న కసి లోకేష్ కు బాగా నచ్చిందట..
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications